ట్యాంక్ బండ్‌పై చిన్నారి మృతి

ట్యాంక్ బండ్‌పై చిన్నారి మృతి

గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాంక్ బండ్‌పై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తుండగా ట్యాంక్ బండ్‌పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి శ్రీ అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి సమన్య, తండ్రి శివకుమార్, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. వీరిలో సమన్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదం జరగడానికి కారణమని గాంధీనగర్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.