గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన తిరుపతి ఎంపీ

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన తిరుపతి ఎంపీ

తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు (64) బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇటీవలే కరోనా వైరస్‌ బారిన పడిన ఎంపీ దుర్గాప్రసాద్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగా బుధవారం సాయంత్రం బల్లి దుర్గాప్రసాద్‌కు ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

బల్లి దుర్గాప్రసాద్‌ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు.