ఈరోజు 3వ రోజు వైసీపీ బస్సు యాత్ర.. ఈ ప్రాంతాల్లోనే

Today is the 3rd day of YCP bus trip.. in these areas
Today is the 3rd day of YCP bus trip.. in these areas

నేడు 3వ రోజు వైసీపీ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇవాళ సామాజిక సాధికార యాత్ర డే 3లో భాగంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇందులో రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స, సిదిరి అప్పలరాజు, కార్మూరి, మేరుగ, విడదల, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 కు బస్సు యాత్ర ప్రారంభంకానుంది.

అనంతరం విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం జరుగనుంది. అలాగే.. కోస్తా రీజన్…బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో ఈ బస్సులో జరుగనుంది. ఇందులో పార్థసారథి, మంత్రి జోగి రమేష్, ఇతర ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొననున్నారు. రాయలసీమ రీజన్ లో అంటే…కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం ఈ బస్సు యాత్ర జరుగుతుంది. ఇందులో డిప్యూటీ సీఎం అంజాద్ భాష, అనిల్ కుమార్ యాదవ్, బుట్టా రేణుక, ఆకేపాటి అమర్నాథ్ ఇతర నేతలు పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు వైవిఆర్ ఫంక్షన్ హాల్ లో స్థానికులతో సమావేశం జరుగనుంది.