నవదీప్ కోసం ఐదుగురు హీరోలు రంగప్రవేశం

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

tollywood hero navadeep get notice for drugs racket case

డ్రగ్స్‌ మాఫియా కెల్విన్‌ ముఠా నుంచి సేకరించిన సమాచారం మేరకు ఎక్సైజ్‌ అధికారులు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు సిట్‌కు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌, రవితేజ, చార్మి, ముమైత్‌ఖాన్‌, సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడు, శ్రీనివాసరావులు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఎక్సైజ్‌ నుంచి అందుకున్నారు. ఈనెల 19 నుంచి 27 వరకూ సిట్‌ వీరిని విచారించనుంది.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌నుంచి నోటీసులందుకున్న హీరో నవదీప్‌ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో నవదీప్‌కు అనధి కార వాటా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. నవదీప్‌ తరచూ ఆ ఐదుగురు అగ్రహీరోలకు కాస్ల్టీ మెటిరీయల్‌, రిచ్‌ పార్టీలు ఇస్తున్న కారణంగానే వారు నవదీప్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే డ్రగ్‌ కేసులో నోటీసులందుకున్న వారంతా తెలంగాణ కేబినెట్‌లోని ఓ మంత్రి ఫోన్‌ చేసి కాపాడాలని కోరినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఆ మంత్రి ఎటువంటి హామీ ఇవ్వలేదు. మరోపక్క సిట్‌ రెండవ జాబితాను సిద్ధం చేస్తోంది.

మరిన్ని వార్తలు

డ్రగ్స్ తో సంబంధం ఉన్న టాలీవుడ్ నటీనటులు వీళ్ళే…

రెండు పడవలపై కాళ్ళు పెడుతున్న వైసీపీ.

శమంతకమణి… తెలుగు బులెట్ రివ్యూ.