యువకుడిని బలితీసిన ట్రయాంగిల్ లవ్.

ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన అనుమానాస్పద మృతి కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. కృష్ణా జిల్లాలో రెండ్రోజుల క్రితం జరిగిన యువకుడి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు పనిగట్టారు. ముక్కోణపు ప్రేమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. తాను ప్రేమిస్తున్న యువతిని ప్రేమిస్తున్నాడన్న ఆక్రోశంతో ఓ వ్యక్తి స్నేహితుడి ప్రాణాలు తీసేశాడు. నూజివీడు పోలీస్‌‌స్టేషన్‌లో తాజాగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.శ్రీనివాసులు కేసు వివరాలు వెల్లడించారు.

అయితే అసలు ఏం జరిగిందంటే.. తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన దైదా రామకృష్ణ ఈనెల 23న అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఖమ్మంజిల్లా బీరాపల్లి వెళ్లే రహదారిలోని ఎన్‌ఎస్పీ కాలువ వద్ద ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత అతడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా కేసును పోలీసులు చేధించారు. అయితే విస్సన్నపేట మండలం పుట్రేల శివారు.. వీరరాఘవాపురం గ్రామానికి చెందిన కారుమంచి విజయరావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అయితే రామకృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడని అందుకే అలా చంపేసినట్లు స్పష్టమైంది.