చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తున్న త్రిష

చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తున్న త్రిష

సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత చిరంజీవి కోరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం దర్శకుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు ని కలిసినట్లు సమాచారం. విలన్ పాత్రకి సంబంధించిన కథని వివరించారని తెలుస్తుంది. అయితే తన పాత్ర కి సంబంధించి మోహన్ బాబు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తెలుపలేదు. అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం బ్లాక్ బస్టరే. అయితే కథ విషయంలో మోహన్ బాబు నో చెప్పడానికి ఆస్కారం లేదని తెలుస్తుంది.

గతంలో చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబు విలన్ గా నటించారు. విలక్షణమైన నటనకి తోడుగా, కామెడీ కూడా పండించగల నటుడు మోహన్ బాబు. చివరగా వీరు కలిసి నటించిన చిత్రం కొదమసింహం. అయితే మరొకసారి వీరిద్దరూ తెర ఫై కనబడితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. మరి మోహన్ బాబు ఈ పాత్రని అంగీకరిస్తారో లేదో చూడాలి. కాగా ఈ చిత్రంలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో రెజినా ప్రత్యేక పాటలో చిరంజీకి తో ఆడిపాడనుంది. కొరటాల చిత్రానికి మొదటిసారిగా మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.