మళ్లీ ఇద్దరంటున్న త్రివిక్రమ్‌

Trivikram Plans two Heroines for NTR Movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్‌ గత చిత్రాలు ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అఆ’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాల్లో ఇద్దరేసి హీరోయిన్స్‌ నటించిన విషయం తెల్సిందే. తాజాగా ఈ చిత్రంలో కూడా త్రివిక్రమ్‌ ఇద్దరు హీరోయిన్స్‌ను రిపీట్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్స్‌తో వర్క్‌ చేయడం అనేది త్రివిక్రమ్‌కు సెంటిమెంట్‌గా వస్తుంది. అందుకే కథలో ప్రాముఖ్యత ఉన్నా లేకున్నా కూడా ఇద్దరు హీరోయిన్స్‌ను తన చిత్రంలో తీసుకుంటూ త్రివిక్రమ్‌ చిత్రాలు చేస్తూ ఉన్నాడు.

‘అజ్ఞాతవాసి’ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటించారు. ఆ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ అవసరమే లేదు. అయినా కూడా ఇద్దరిని పెట్టాడు. అలాగే ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోతున్న చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్స్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌ త్వరలోనే రెండవ హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు శ్రద్దా కపూర్‌ ఒక హీరోయిన్‌గా ప్రచారం జరిగింది. కాని ఆమె బిజీ షెడ్యూల్‌ కారణంగా ఈ చిత్రాన్ని చేయలేను అంటూ చెప్పింది. దాంతో త్రివిక్రమ్‌ మరో హీరోయిన్‌తో చర్చు జరుపుతున్నాడు. అవసరం లేకున్నా కూడా ఇద్దరు హీరోయిన్స్‌ ఎందుకు అంటూ త్రివిక్రమ్‌ విషయంలో కొందరు అభ్యంతరం చెబుతున్నా ఆయన మాత్రం తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తున్నాడు.