గుమ్మడికాయ కొట్టి మళ్లీ ఇదేంటి సుక్కు?

Sukumar Plans to ReShoot for Rangasthalam movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌కు ఇటీవలే గుమ్మడికాయ కొట్టిన విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలం పాటు షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టడంతో మెగా ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీల్‌ అయ్యారు. ఇక విడుదల వాయిదా ఉండదని అంతా భావిస్తున్న తరుణంలో దర్శకుడు సుకుమార్‌ మరో మూడు లేదా నాలుగు రోజు షూటింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సమంతతో పాటు ముఖ్య తారాగణంతో కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయాలని సుకుమార్‌ భావిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అనధికారిక సమాచారం అందుతుంది.

ఇటీవల రామ్‌ చరణ్‌ను మరో నాలుగు రోజుల డేట్లు కేటాయించాల్సిందిగా సుకుమార్‌ కోరాడని, అందుకు చరణ్‌ కూడా ఓకే చెప్పాడని గుసగుసలు వినిపస్తున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ చిత్రం మళ్లీ షూటింగ్‌ అనడంతో విడుదల వాయిదా పడేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రీ షూట్‌ చేయాలని సుకుమార్‌ భావిస్తున్నాడు. ఒక వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతుండగా మరో వైపు ఈ చిత్రం రీ షూట్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సినిమాకు గుమ్మడి కాయ కొట్టిన తర్వాత ఇలా రీషూట్‌ చేయడం ఏంటని కొందరు సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సుకుమార్‌ స్థాయికి ఇది సరైన నిర్ణయం కాదని అంటున్నారు. అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్‌ కాకూడదనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు సుకుమార్‌ ఇలా రీ షూట్‌ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.