మహిళా వీఆర్వో ఇంటికి రాత్రి వెళ్లిన టీఆరెస్ ఎమ్మెల్యే…!

TRS MLA Went To Women VRO House In Night

వివాదాస్పద ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం కోట్లాది రూపాయల విలువ చేసే పోరంబోకు స్థలాన్నీ తన అనుచరుడి పేరు మీద పట్టా పుట్టించేందుకు రాత్రివేళ తన అనుచరులతో కలిసి పెంబర్తి వీఆర్వో ఇంటికెళ్లారు. అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యే తన మందీమార్బలంతో ఇంటికి రావడంతో వారందరినీ చూసిన మహిళా వీఆర్వో బెంబేలెత్తినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి ఈ ఘటన జరుగగా ఆమె ఈ విషయాన్ని నిన్న వీఆర్వోల సంఘం, టీఎన్‌జీవోల సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది.

TRS MLA Went To Women VRO House In Night

ఆయితే ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న ఆయా సంఘాల నాయకులు అంతా కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నేడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే విషయంసీరియస్ కావడంతో టీఆరెస్ పెద్దల నుండి అక్షింతలు పడటంతో ఈ వివాదం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించారు. తాను వీఆర్వో ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన తాను అనుచరుడికోసం వెళ్లలేదని ఓ వెంచర్‌కు సంబంధించి పట్టా చేసే విషయంలో జాప్యం జరుగుతుండడంతో బాధితులు తనకు చెప్పుకుని బాధపడ్డారని వారి బాధచూడలేకనే వీఆర్వో ఇంటికి వెళ్లి మాట్లాడినట్టు చెప్పారు.