TS Politics: తెలంగాణ జర్నలిస్టుల డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

TS Politics: CM Revanth Reddy launched Telangana journalists' diary
TS Politics: CM Revanth Reddy launched Telangana journalists' diary

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 సంవత్సరం డైరీని సీఎం రేవంత్ రెడ్డి నిన్న డా|| బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమవంతు కృషి చేయాలని సీఎం గారు కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీ మహ్మద్ సాదిక్ పాష, వైస్ ప్రెసిడెంట్లు కోడురు శ్రీనివాసరావు, శ్రీ జంగిటి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ శ్రీ మధు మల్కేడికర్, కోశాధికారి శ్రీ సురేశ్ వేల్పుల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శ్రీ సోము సముద్రాల, శ్రీ కంచెరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.