మల్టీస్టారర్‌పై అనీల్‌ రావిపూడి క్లారిటీ…

Venkatesh And Varun Tej Multi Starrer in Anil Ravipudi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మాస్‌ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనీల్‌ రావిపూడి ఇటీవలే ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ దర్శకుడి తర్వాత సినిమా ఇప్పటికే ఖరారైంది. దిల్‌రాజు బ్యానర్‌లో అనీల్‌ రావిపూడి ఒక మల్టీస్టారర్‌ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. మల్టీస్టారర్‌ చిత్రంలో హీరోలు ఎవరు అనే విషయమై కూడా ఒక అనధికారిక క్లారిటీ వచ్చింది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు ఆ చిత్రంలో కలిసి నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం విడుదలై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అనీల్‌ తన తర్వాత సినిమాను మొదలు పెట్టకపోవడంతో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. అసలు మల్టీస్టారర్‌ ఉందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

తాజాగా అనీల్‌ రావిపూడి నుండి ఒక క్లారిటీ వచ్చింది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లతో ఒక మల్టీస్టారర్‌ చిత్రం చేయబోతున్నాను, ఆ చిత్రంను మేలో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా దర్శకుడు ప్రకటించాడు. ప్రస్తుతం వెంకటేష్‌, తేజ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించి కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. వేసవిలో ఆ చిత్రాన్ని విడుదల చేసి ఆ వెంటనే ఈ చిర్రతాన్ని షురు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ల కాంబినేషన్‌ అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందా అనేది చూడాలి. దిల్‌రాజు సినిమా అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే విధంగా మల్టీస్టారర్‌ ఉండవచ్చు అంటూ అప్పుడే విశ్లేషణలు మొదలు అయ్యాయి.