ట్రైలర్ రివ్యూ : ఎల్ఎల్బిగా రచ్చ చేయబోతున్న సప్తగిరి
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథాచిత్రమ్’తో ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన సప్తగిరి ఆ తర్వాత పలు చిత్రాల్లో కమెడియన్గా చాలా కీలక పాత్రలు పోషించాడు. పు సినిమాలు సప్తగిరి కామెడీ కారణంగా ఆడాయి. అటువంటి సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ చిత్రంగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో కమెడియన్స్ హీరోలుగా చేయడం చాలా కామన్. అలాగే సప్తగిరి ఒకటి రెండు సినిమాలు చేసి ఊరుకుంటాడు అని, ఒక సాదా సీదా కమెడియన్ సినిమాల తరహాలోనే సప్తగిరి సినిమాలు ఉంటాయని అంతా భావించారు. కాని సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

ఒక పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా ఈ చిత్రంలో సప్తగిరి కనిపించబోతున్నాడు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని విధాలుగా సప్తగిరి ఈ చిత్రంలో నటించాడు. ఇటీవలే విడుదలైన టీజర్తో సినిమాలో మ్యాటర్ ఉందనిపించారు. తాజాగా విడుదలైన ట్రైలర్తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటుందని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక కమర్షియల్ సినిమాల ఉండబోతుందని అంటున్నారు. సప్తగిరి తన కామెడీతో పాటు తన యాక్షన్ మరియు ఎమోషన్తో సినిమాలో రచ్చ చేయడం ఖాయం అంటూ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికే ఈ సినిమా అమ్ముడు పోయింది. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా సప్తగిరిని హీరోగా మరో మెట్టు ఎక్కించడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది.
ట్రైలర్ రివ్యూ : మాస్ బాలకృష్ణుడు
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నారా రోహిత్ చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్గా సక్సెస్ కావడం లేదు. సక్సెస్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న నారా రోహిత్ తాజాగా చేసిన మరో ప్రయత్నం బాలకృష్ణుడు. ఈ చిత్రంలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడంతో పాటు, గత చిత్రాలతో పోల్చితే చాలా వైవిధ్యంగా కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి చెబుతున్నారు. ఒక పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని చిత్ర దర్శకుడు ఇటీవలే చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. సమంత, రాశిఖన్నా, సాయి ధరమ్ తేజ్ ఇంకా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.
ట్రైలర్ చూస్తుంటే సినిమా పూర్తి స్థాయి మాస్, యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని అనిపిస్తుంది. సరదాగా సాగిపోయే స్క్రీన్ప్లేతో ఒక సీరియస్ యాక్షన్ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. కమెడియన్ పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్ ఇంకా పలువురు కమెడియన్స్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక టీజర్లో చూస్తుంటే ఒక రొటీన్ ఫ్యాక్షన్ స్క్రీన్ప్లేతో, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిందని అనిపిస్తుంది. సినిమాలో ఇదే స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినీ వర్గాల వారిలో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. మరి ఈ సినిమాతో అయినా నారా రోహిత్కు కమర్షియల్ బ్రేక్ దక్కుతుందేమో చూడాలి.
నిర్మాత లేదా దర్శకుడితో పడుకోవడం వ్యక్తిగతం
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కొందరు హీరోయిన్స్ అవకాశాలు దక్కించుకోవాలి అంటే దర్శకుడు, హీరో లేదా నిర్మాతల కోరిక తీర్చాల్సిందే అని, ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న హీరోయిన్స్ అంతా కూడా వారిని సంతృప్తి పర్చి అవకాశాలను దక్కించుకున్న వారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాని స్టార్ హీరోయిన్స్ మాత్రం కొందరు తమకు అలాంటి పరిస్థితి రాలేదు అని, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయమై తమిళ హీరోయిన్ ఆండ్రియా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ‘డిటెక్టివ్’ అనే విశాల్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆండ్రియా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆ మీడియా సమావేశంలో ఆండ్రియా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ… హీరోయిన్ దర్శకుడు లేదా నిర్మాతతో పడుకోవడం అనేది వారి వ్యక్తిగత విషయం. ఆ విషయాలను మీడియా పట్టించుకోవాల్సిన పని లేదు. అవకాశాల కోసం పడుకుంటున్నారా లేదా మరే కారణంగా పడుకుంటున్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీడియా ఈ విషయం గురించి ఆలోచించకుంటే బెటర్ అంటూ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘జైసింహా’ మరో సింహా అయ్యేనా?
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ, బోయపాటిల కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య కెరీర్లోనే మొదటి సారి 50 కోట్లను క్రాస్ చేసిన సినిమాగా సింహా నిలిచింది. ఆ సినిమా తర్వాత బాలయ్య స్థాయి పెరిగి పోయింది. అయితే ఆ స్థాయిలో బాలయ్యకు మళ్లీ విజయం దక్కలేదని చెప్పాలి. ఈ సంవత్సరం విడుదలైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం కూడా ఆ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ‘సింహా’ స్థాయిని చేరుకునేందుకు వచ్చే సంవత్సరం బాలయ్య ‘జైసింహా’తో బాక్సాఫీస్పై పంజా విసరబోతున్నాడు.
టైటిల్లో సింహా పదం ఉంటే బాలయ్యకు సక్సెస్ గ్యారెంటీ. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు అలా సక్సెస్ అయ్యాయి. ‘సింహా’ లుక్తో పాటు, అచ్చు సినిమా టైటిల్ లోగో మాదిరిగానే ‘జైసింహా’ను కూడా డిజైన్ చేయించారు. సింహా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వానే ఉద్దేశ్యంతో బాలయ్య చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సింహాలో మాదిరిగానే జైసింహాలో కూడా ద్విపాత్రాభినయంలో బాలయ్య కనిపించబోతున్నాడు. సింహా చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. జైసింహాతో కూడా బాలయ్య షేక్ చేయాలని భావిస్తున్నాడు.
‘సింహా’ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటించిన విషయం తెల్సిందే. ఇక జైసింహా చిత్రంలో కూడా హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇలా పలు అంశాలు, సెంటిమెంట్లు కలుస్తున్న కారణంగా జైసింహా మరో సింహా అవ్వడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అయితే దర్శకుడు ఇప్పటి వరకు తెలుగులో మంచి సక్సెస్ను అందుకోలేదు. తమిళంలో స్టార్ అయినా కూడా తెలుగులో మాత్రం కేఎస్ రవికుమార్కు పెద్దగా స్టార్డం లేదు. తమిళ ఫ్లేవర్లో సినిమాను తెరకెక్కించాడేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ‘జైసింహా’ చిత్రం సంక్రాంతికి అయితే సూపర్ హిట్ లేదా అట్టర్ ఫ్లాప్ అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య కెరీర్లో ‘జైసింహా’ నిలిచిపోయే సినిమాలా ఉంటుందని చెబుతున్నారు.
ఎన్టీఆర్ ఆత్మ వర్మతో చెప్పిన మాటలు ఇవే…
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటించిన తరువాత కొన్నిరోజులు దానిపై టీడీపీ నేతలతో వివాదం నడిపి… వార్తల్లో ఉంచిన రామ్ గోపాల్ వర్మ వారం రోజులు సైలెంట్ గా ఉన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ముందే నాగార్జునతో వర్మ ఓ సినిమా చేయనున్నారని… అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి సైలెంట్ అయ్యారని టాక్ వినిపించింది. కానీ ఆ ఊహాగానాలకు తెరదించుతూ వర్మ మళ్లీ తన స్టయిల్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారం మొదలుపెట్టారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా తీయడానికి తనకు అపారమైన బలమిస్తున్న ఒకే ఒక శక్తి ఎన్టీఆర్అని, ఆ మహానుభావుడి ఆత్మ రోజూ తన కలలోకి వచ్చి స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోందని హాస్యాస్పద వ్యాఖ్యలు చేసిన వర్మ తాజాగా మరింత నవ్వుపుట్టించే పోస్ట్ ఒకటి చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియో పోస్ట్ చేశారు వర్మ. ఆ వీడియోలో ఎన్టీఆర్ చేశారని వర్మ చెబుతున్న వ్యాఖ్యలు ఇవి…
రామ్ గోపాల్ వర్మగారూ…మిత్రులు అక్కినేని నాగేశ్వరరావు గారు పరిచయం చేయగా… గతంలో మీరొకసారి మమ్మల్ని కలిశారు. మేము కరచాలనం చేశాం. మీ ప్రతిభ గురించి, మేథస్సు గురించి, ప్రజ్ఞాపాటవాలు గురించి, మీ వ్యక్తిత్వం గురించి అక్కినేని గారు ఆనాడే నాకు మీ పరోక్షంలో వివరించారు. నేను ఇలా అశరీరవాణిలా మీకు వినిపించడానికి కారణం మీరు మాపై తీస్తున్న చలనచిత్రం. మరుగునపడబోతున్న చారిత్రక సత్యాలను మరుగున పెడుతున్నవారు బతికుండగానే తెరకెక్కించే ప్రయత్నం మీరు చేయడం నిజంగా సాహసం… సాహసం… సాహసం. ఈ మీ సాహసాన్ని ప్రశంసించడంతో పాటు మీకు, ఈ లోకానికి, నా అర్ధాంగి లక్ష్మికి కూడా తెలియని కొన్ని అతిముఖ్యమైన విషయాలను మీకు చెప్పదలచాను….ఎప్పుడేది అవసరమో మాకే తెలియును గనక ఆ విషయాలను మేమే ఇలా అశరీరవాణి ద్వారా మీకు మాత్రమే వినిపించి చెబుతాం… ఇకపై మా ఏకాంత సంభాషణ మీతోనే..అని ఎన్టీఆర్ వాయిస్ వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ..వర్మ హాస్యాస్పదంగా ఓ కామెంట్ కూడా జత చేశారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ గారే తనకీ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారని, ఇది నమ్మనివాళ్లందరూ కచ్చితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు అని వర్మ వ్యాఖ్యానించారు. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ ఎంత క్రియేటివ్ గా తెరకెక్కిస్తారో తెలియదు కానీ….ప్రచారాన్ని మాత్రం అత్యంత సృజనాత్మకంగా నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య సమంత క్రిస్టియన్ మ్యారేజ్ వీడియో…
Exclusive weeding video of #chaysam💖
Publié par NagaChaitanya Fans sur samedi 14 octobre 2017



