బాల్ థాక‌రే పాత్ర‌లో ఒదిగిపోయిన న‌వాజుద్దీన్

0

Thakeray Movie Teaser Released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హారాష్ట్ర బెబ్బులి బాల్ థాక‌రే జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న థాక్రే సినిమా టీజ‌ర్ విడుద‌ల‌యింది. బాల్ థాక‌రే గా న‌టిస్తున్న విల‌క్ష‌ణ‌న‌టుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ త‌న పాత్ర‌లో ఒదిగిపోయిన‌ట్టు టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న టీజ‌ర్ లో కాషాయ వ‌స్త్రాలు మాత్ర‌మే రంగుల్లో క‌నిపించాయి. టీజ‌ర్ చివ‌ర్లో ఓ వ్య‌క్తి హిందూస్థాన్ కా లీడ‌ర్ బాబా సాహెబ్ థాక‌రే అని పెద్ద గొంతుతో నిన‌దిస్తుండ‌గా… న‌వాజుద్దీన్ సిద్దిఖీ అశేష జ‌న‌వాహిని ఎదురుగా నిల్చుని చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్న దృశ్యం… అచ్చంగా బాల్ థాక‌రేను గుర్తుకుతెచ్చింది. థాక‌రే బ‌ల‌మైన శివ‌సేన నాయ‌కుడిగా ఎలా మారాడ‌నే అంశాల‌ను ఇందులో చూపించ‌నున్నారు. సినిమాకు పాత్రికేయుడు, శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ క‌థ అందించ‌గా… మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అభిజిత్ ప‌న్సే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Nawazuddin-Siddiqu

హిందీ,మ‌రాఠీ భాష‌ల‌తో పాటు ఇంగ్లీషులోనూ ఈ చిత్రాన్ని 2019 జ‌న‌వ‌రి 23న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది. థాక్రే పాత్ర‌లో న‌టిస్తుండ‌డం గ‌ర్వంగా ఉంద‌ని న‌వాజుద్దీన్ ట్వీట్ చేశారు. థాక్రే చిత్ర ఫ‌స్ట్ లుక్, ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మానికి బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాల్ థాక‌రే తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అమితాబ్. కూలీ చిత్ర స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు త‌న ప్రాణాలు కాపాడింది బాల్ థాక‌రే అని అమితాబ్ చెప్పారు.

Nawazuddin-Siddiqui-impress

బెంగ‌ళూరులో కూలీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో గాయ‌మైంద‌ని, అక్క‌డి నుంచి చికిత్స కోసం ముంబై తీసుకురావాల్సి ఉండ‌గా..భారీ వ‌ర్షాల కార‌ణంగా అంబులెన్స్ దొర‌క‌లేద‌ని, అప్పుడు బాల్ థాక‌రే త‌న కోసం శివ‌సేన అంబులెన్స్ ను పంపించార‌ని అమితాబ్ తెలిపారు. భోఫోర్స్ కుంభ‌కోణం స‌మ‌యంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు కూడా బాల్ థాక‌రే త‌న‌కు అండ‌గా ఉన్నార‌ని, భ‌య‌ప‌డ‌కు నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పార‌ని గుర్తుచేసుకున్నారు. బాల్ థాక‌రే చ‌నిపోవ‌డానికి ముందు ఆయ‌న్ను చూసేందుకు ఉద్ధ‌వ్ త‌న‌ను అనుమ‌తించార‌ని, ఆయ‌న మంచంపై అలా నిద్ర‌పోవ‌డం చూసి త‌న హృదయం ద్ర‌వించింద‌ని, అలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న్ను చూడాల్సొస్తుంద‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని బిగ్ బీ భావోద్వేగానికి లోన‌య్యారు. ద‌శాబ్దాల పాటు మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించిన బాల్ థాక‌రే 2012 న‌వంబ‌ర్ 17న‌ తుదిశ్వాస విడిచారు.

‘మోహిని’తో త్రిష మళ్లీ ఫాంలోకి..!

0

mohini trailer released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు మరియు తమిళంలో దాదాపు పుష్కర కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌గా సత్తా చాటిన ముద్దుగుమ్మ త్రిష. ఈ అమ్మడు తెలుగులో మరియు తమిళంలో ఎంతో మంది స్టార్‌ హీరోల సరసన నటించింది. అయితే ఏ హీరోయిన్‌కు అయినా కూడా కొంత కాలం తర్వాత ఫాం కోల్పోవడం తప్పదు. అలాగే త్రిష కూడా తన ప్రాభవాన్ని కోల్పోయింది. రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు, పెద్ద స్టార్స్‌ ఈమెను కోరుకోలేదు. దాంతో త్రిష కెరీర్‌ ఖతం అయినట్లే అని అంతా భావించారు. అయితే తన రీఎంట్రీని ‘మోహిని’తో ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.

గత సంవత్సర కాలంగా ‘మోహిని’ చిత్రాన్ని త్రిష చేస్తోంది. ఆర్‌ మదేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోహిని’ చిత్రంతో త్రిష మళ్లీ తెలుగు మరియు తమిళంలో బిజీ అవ్వడం ఖాయం అని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. అంతా భావిస్తున్నట్లుగానే త్రిష ‘మోహిని’ చిత్రంలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుతున్నాడు. ట్రైలర్‌లో త్రిష తన నట విశ్వరూపం చూపించడంతో పాటు, తన గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదని చెప్పకనే చెప్పింది. దాంతో ఈ సినిమా తర్వాత తప్పకుండా త్రిషకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు. తెలుగులో మోహిని టీజర్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

జయ అపోలో వీడియో బయటకు వచ్చిందోచ్.

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె మరణం ఓ విధంగా తమిళనాడు రాజకీయాలనే కాదు మొత్తం రాష్ట్ర గతినే మార్చేసింది. జయ వ్యక్తిగత, రాజకీయ వారసత్వం కోసం ఇంకా యుద్ధం కొనసాగుతూనే వుంది. ఆమె ఆస్తులు, అన్నాడీఎంకే పార్టీలో పదవుల కోసం ఇంకా రచ్చ సాగుతూనే వుంది. ఈ రేసులో మొదట్లో అంతా తానే అయి ముందుకు నడిచిన శశికళ వర్గం ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడింది. పాత కేసులో శశికళ జైలుకు వెళితే, కేంద్రంతో కాలు దువ్వినందుకు ఆమె అనుచరగణం మీద ఐటీ ఇతరత్రా దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఈ పరిస్థితుల్లో జయ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడా శశి వర్గానికి చెందిన దినకరన్ డబ్బులు పంచి, ఈసీ కి లంచం ఎర వేసి అడ్డంగా దొరికిపోయారు. తమిళ ప్రజల్లో ఇంకా శశికళ మీద ఎన్నో అనుమానాలు.

Dinakaran-release-jaya-apol

శశికళ వల్లే జయలలిత చనిపోయారని, కేసులు ఎదుర్కొన్నారని భావిస్తున్న వాళ్ళ సంఖ్య తమిళనాడులో చాలా ఎక్కువ. జయ మరణం తర్వాత శశి వ్యతిరేకులు ఇదే అంశాన్ని ఇంకాస్త విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ పరిస్థితుల్లో జనం నమ్మకాన్ని మళ్లీ పొందాలంటే జయ మరణంతో తమకు సంబంధం లేదని, చివరి దాకా ఆమె ఆరోగ్యం కోసం శ్రమించామని చెప్పేందుకు శశికళ వర్గం తాజాగా ఓ పాచిక విసిరినట్టు తెలుస్తోంది. జయ ఆస్పత్రిలో ఉండగా తీసిన ఓ వీడియో ను ఆర్కే నగర్ ఎన్నికలకు ముందు విడుదల చేసింది. ఆ వీడియో లో జయ జ్యూస్ తాగుతూ కనిపించారు.

టీజర్‌ రివ్యూ : యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా తొలిప్రేమ డైలాగ్‌

0

tholi prema teaser review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘తొలిప్రేమ’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్‌ తేజ్‌ సక్సెస్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న కొత్త ‘తొలిప్రేమ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. భారీ స్థాయిలో అంచనాలున్న ‘తొలిప్రేమ’ చిత్రం టీజర్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌ కేవలం 30 సెకన్లు ఉన్నా, వరుణ్‌ చెప్పింది ఒక్క డైలాగే అయినా కూడా యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా, ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా ఉంది, సినిమాపై అంచనాలు పెంచే విధంగా టీజర్‌ ఉంది. 

టీజర్‌లో వరుణ్‌ తేజ్‌ చెప్పిన మన జీవితంలోకి ఎంతో మంది అమ్మాయిలు వచ్చి వెళ్తూ ఉంటారు. కాని ఫస్ట్‌ ప్రేమించిన అమ్మాయిని మాత్రం ఎప్పటికి మర్చిపోలేం డైలాగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రం ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వరుణ్‌ తేజ్‌ ుక్‌ మరియు దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్‌ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రం తప్పకుండా హిట్‌ అవుతుందనేందుకు మరో కారణం దిల్‌రాజు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను దిల్‌రాజు తీసుకోవడంతో తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. 

ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌కు జోడీగా రాశిఖన్నా నటించింది. తొలిప్రేమ టైటిల్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా అనేది చూడాలి. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను సంక్రాంతి లేదా రిపబ్లిక్‌ డేకు విడుదల చేసే అవకాశం ఉంది. ‘ఫిదా’ తర్వాత వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో మరో సూపర్‌ హిట్‌ చిత్రంగా ఇది నిలుస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

టీజర్‌ రివ్యూ : భయపెడుతున్న ‘భాగమతి’

0

anushka-shetty-bhagmati--mo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనుష్క ‘బాహుబలి’ చిత్రం తర్వాత భారీ క్రేజ్‌ను దక్కించుకుంది. ఆ చిత్రం తర్వాత పూర్తి స్థాయి చిత్రాన్ని ఇప్పటి వరకు కమిట్‌ కాలేదు. ‘బాహుబలి’ చేస్తున్న సమయంలోనే అనుష్క ‘పిల్లజమీందార్‌’ ఫేం అశోక్‌ దర్శకత్వంలో ‘భాగమతి’ చిత్రాన్ని కమిట్‌ అయిన విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం చాలా చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్రాన్ని విడుదలకు సిద్దం చేస్తున్నారు. వచ్చే నెలలో రిపబ్లిక్‌ డే సందర్బంగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మద్య అనుష్క ఫస్ట్‌లుక్‌ రచ్చ రచ్చ చేసింది. అసలు ఈ చిత్రం కథ ఏంటీ? అనుష్క ఎలా కనిపించబోతుంది? అంటూ చర్చ షురూ అయ్యింది.

ఇక తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌తో సినిమా స్థాయి మరింత పెరిగింది. అలాగే ఈ చిత్రంపై ఒక క్లారిటీ వచ్చింది. ఇదో హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రంగా తేలిపోయింది. టీజర్‌లో ఇది మరో అరుంధతి అంటూ చెప్పకనే చెప్పారు. అయితే అరుంధతి చిత్రం మాదిరిగా ఇది సోషియో ఫాంటసీ కాకుండా ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రంలా ఉంటుందని తెలుస్తోంది. అనుష్క పాత్ర సినిమా స్థాయిని పెంచుతుందని అనిపిస్తుంది. అనుష్క ఎందుకు తనను తాను శిలువ వేసుకుంటుంది, ఎందుకు ఆ బంగ్లా అలా ఉంది అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ప్రభాస్‌ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కనుక చిత్రం ప్రమోషన్‌లో ప్రభాస్‌ కనిపించడం ఖాయం. ఇక అనుష్క ‘భాగమతి’గా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. టీజర్‌తో సినిమాపై ఒక క్లారిటీ వచ్చినప్పటికి, ట్రైలర్‌ విడుదల అయితే ఫుల్‌ పిక్చర్‌ కనిపించనుంది. ట్రైలర్‌లో మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సినిమా మొత్తంగా ఎలా ఉంటుందో చూడాలి అంటే రిపబ్లిక్‌ డే వరకు ఆగాల్సిందే.

 

అజ్ఞాతవాసి టీజర్ అరుపులు…

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

agnathavasi teaser

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ కీర్తి సురేష్ మరియు అను ఇమ్మానుఎల్ హీరో హీరోయిన్లు గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ కి ‘అజ్ఞాతవాసి’ 25 వ చిత్రం అవ్వటంతో పాటు, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వెళుతున్న కారణంగా ఇంకా పవన్ కళ్యాణ్ నటించే లాస్ట్ సినిమా అనుకుంటున్న నేపధ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు…

ఇప్పటికే రిలీజ్ అయిన అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన రెండు పాటలు ఒక్కరోజులోనే 1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నది అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో అర్ధమవుతోంది. ఈరోజు అజ్ఞాతవాసి మూవీ టీజర్ రిలీజ్ కాబోతున్న సందర్భంలో పవన్ ఫాన్స్ ఇప్పటికే ప్రత్యేకమైన లార్జ్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేసారు. కొంతమంది ఫాన్స్ బైక్ రేస్ లతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇంకొంతమంది ఫాన్స్ పవన్ కళ్యాణ్ ఫొటోస్ కి పాలాభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ మూవీ టీజర్ మీఅందరికోసం.. మీరు కూడా ఒక లుక్ వేయండి

వర్మ కడప రెడ్ల సిరీస్ వచ్చేసింది

0

RGV's Kadapa Web Series Trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నట్లుగానే ‘కడప’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశాడు. దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ట్రైలర్‌లోనే తన వెబ్‌ సిరీస్‌లో ఏం ఉండబోతుంది, ఎలాంటి సన్నివేశాలను తన వెబ్‌ సిరీస్‌లో చూపించబోతున్నాడో వర్మ చెప్పకనే చెప్పాడు. పలు ఫ్యాక్షన్‌ సీన్స్‌ను తన గత చిత్రాల నుండి కాపీ కొట్టినట్లుగా అనిపిస్తున్నాయి. యూట్యూబ్‌లో పెట్టే కంటెంట్‌కు ఎలాంటి సెన్సార్‌ అక్కర్లేదు కనుక విచ్చలవిడిగా బూతులను వాడటంతో పాటు, మరీ దారుణంగా రక్తపాతంను చూపించడం జరిగింది. వర్మ కొన్ని సీన్స్‌లలో మరీ వల్గర్‌ బూతులను వాడటం జరిగింది. చెప్పడానికి సైతం వీలు లేనివర్మ ‘కడప’ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ టాక్‌

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నట్లుగానే ‘కడప’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశాడు. దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ట్రైలర్‌లోనే తన వెబ్‌ సిరీస్‌లో ఏం ఉండబోతుంది, ఎలాంటి సన్నివేశాలను తన వెబ్‌ సిరీస్‌లో చూపించబోతున్నాడో వర్మ చెప్పకనే చెప్పాడు. పలు ఫ్యాక్షన్‌ సీన్స్‌ను తన గత చిత్రాల నుండి కాపీ కొట్టినట్లుగా అనిపిస్తున్నాయి. యూట్యూబ్‌లో పెట్టే కంటెంట్‌కు ఎలాంటి సెన్సార్‌ అక్కర్లేదు కనుక విచ్చలవిడిగా బూతులను వాడటంతో పాటు, మరీ దారుణంగా రక్తపాతంను చూపించడం జరిగింది. వర్మ కొన్ని సీన్స్‌లలో మరీ వల్గర్‌ బూతులను వాడటం జరిగింది. చెప్పడానికి సైతం వీలు లేని ఆ డైలాగ్స్‌ను వర్మ కావాలని మరీ జొప్పించినట్లుగా అనిపిస్తుంది.

ట్రైర్‌లోనే ఈస్థాయి రక్తపాతం మరియు బూతులు ఉన్నాయి అటే మొత్తం వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో తాను చూపించాలని భావించి, చూపించలేక పోయిన సీన్స్‌ను, బూతులను ఈ వెబ్‌ సిరీస్‌లో వర్మ చూపించాలని ఫిక్స్‌ అయినట్లుగా కనిపిస్తుంది. వర్మ వెబ్‌ సిరీస్‌ రెడ్డి వర్గంను టార్గెట్‌ చేసిన నేపథ్యంలో ఆ వర్గం వారు చాలా ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాక్షనిజంకు రాయలసీమ అమ్మ అయితే కడప అయ్య అన్నట్లుగా ఉన్న డైలాగ్‌లు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. వర్మ ఆ వెబ్‌ సిరీస్‌ను విడుదల చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడే కొందరు బెదిరిస్తున్నారు. కాని వర్మ అలాంటి వాటికి బెదిరిపోయే రకం కాదు అని అందరికి తెల్సిందే. వర్మ కడప వెబ్‌ సిరిస్‌ మరెంత దుమారంను రేపుతుందో చూడాలి. ఆ డైలాగ్స్‌ను వర్మ కావాలని మరీ జొప్పించినట్లుగా అనిపిస్తుంది.

ట్రైర్‌లోనే ఈస్థాయి రక్తపాతం మరియు బూతులు ఉన్నాయి అటే మొత్తం వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో తాను చూపించాలని భావించి, చూపించలేక పోయిన సీన్స్‌ను, బూతులను ఈ వెబ్‌ సిరీస్‌లో వర్మ చూపించాలని ఫిక్స్‌ అయినట్లుగా కనిపిస్తుంది. వర్మ వెబ్‌ సిరీస్‌ రెడ్డి వర్గంను టార్గెట్‌ చేసిన నేపథ్యంలో ఆ వర్గం వారు చాలా ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాక్షనిజంకు రాయలసీమ అమ్మ అయితే కడప అయ్య అన్నట్లుగా ఉన్న డైలాగ్‌లు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. వర్మ ఆ వెబ్‌ సిరీస్‌ను విడుదల చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడే కొందరు బెదిరిస్తున్నారు. కాని వర్మ అలాంటి వాటికి బెదిరిపోయే రకం కాదు అని అందరికి తెల్సిందే. వర్మ కడప వెబ్‌ సిరిస్‌ మరెంత దుమారంను రేపుతుందో చూడాలి.

‘మిడిల్‌క్లాస్‌ అబ్బాయి’ ట్రైలర్‌ రివ్యూ

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న నాని, దిల్‌రాజుల కాంబినేషన్‌లో మూవీ అనగానే ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అంటూ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాని, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి ఎలా ఉంటాడు చూపించేందుకు ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. నాని సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారు, ఎలా ఉండాలని కోరుకుంటారో అచ్చు అలాగే ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

Nani Sai Pallavi mca movie trailer

ముందు నుండి చెబుతున్నట్లుగా ఈ చిత్రంలో వదిన మరిదిల మద్య జరిగే సన్నివేశాలు సినిమాకు చాలా హైలైట్‌గా ఉంటాయని ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. సినిమాపై ఆసక్తితో పాటు పలు ప్రశ్నలను కూడా ట్రైర్‌ లేవనెత్తి, సినిమా చూసేలా ఆసక్తిని పెంచుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను ఈనెల 21న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చివరి దశలో ఉన్నాయి.

Nani-Sai-Pallavi

నాని వరుస సక్సెస్‌లను ఈ చిత్రం కొనసాగిస్తుందని, ఈ సంవత్సరంలో దిల్‌రాజు బ్యానర్‌కు డబుల్‌ హ్యాట్రిక్‌ను ఈ చిత్రం దక్కిస్తుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ‘హలో’కు పోటీగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆ సినిమా స్థాయిలోనే ఉంటుందని ట్రైలర్‌తో తేలిపోయింది. సాయి పల్లవి, నానిల మద్య రొమాన్స్‌, నాని భూమికల మద్య వదిన మరిది సంబంధం చాలా సహజంగా ఉంటుందని తేలిపోయింది. తప్పకుండా మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.

‘మనసుకు నచ్చింది’ టీజర్‌ రివ్యూ

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మహేష్‌బాబు సోదరి ఘట్టమనేని మంజుల హీరోయిన్‌ కావాలని ఎంతో కోరుకుంది. కాని కొన్ని కారణాల వల్ల ఆమె హీరోయిన్‌ కాలేక పోయింది. అయినా కూడా సినిమా పరిశ్రమను వదిలి పెట్టకుండా సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా మంజుల దర్శకత్వంలో అడుగు పెట్టింది. సందీప్‌ కిషన్‌ హీరోగా అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. మంజుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘మనసుకు నచ్చింది’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. షూటింగ్‌ ముగింపుకు చేరుకున్న నేపథ్యంలో ఈ చిత్రం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

Sundeep-Kishan

టీజర్‌లో హీరో మరియు హీరోయిన్‌ల పాత్రల తీరును పరిచయం చేయడం జరిగింది. ఇద్దరి మద్య కెమిస్ట్రీ మరియు ఇద్దరి మద్య ఉండే సీన్స్‌ ఆకట్టుకునే విధంగా ఉంటాయని టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంను తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తుంది. మంజులతో పాటు ఈ చిత్రాన్ని మరో నిర్మాత కూడా భాగస్వామ్యంలో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే సందర్బంగా జనవరి 26న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అప్పుడే ప్రమోషన్‌ను ప్రారంభించారు. మరో వారం రోజుల్లో ప్యాచ్‌ వర్క్‌తో సహా అంతా పూర్తి చేసి నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. జనవరి రెండవ వారంకు సినిమా మొదటి కాపీని సిద్దం చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.