వాళ్ళు దేవుళ్ళు అయితే మోహన్ బాబు కూడా దేవుడే.

0

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 Gayatri Official Teaser review

మోహన్‌బాబు వారసులుగా విష్ణు, మనోజ్‌, మంచు లక్ష్మిలు వెండి తెరపై సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అప్పుడప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న మోహన్‌బాబు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటించాడు. ‘గాయత్రి’ టైటిల్‌తో మదన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్‌ను సంక్రాంతి సందర్బంగా విడుదల చేశారు. మంచు విష్ణు ఒక ముఖ్యమైన పాత్రలో నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలను పెంచే విధంగా టీజర్‌ ఉంది. మంచు ఫ్యాన్స్‌ను ఫిదా చేసేలా ఉన్న ‘గాయత్రి’ టీజర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది.

మోహన్‌బాబు వయస్సుకు తగ్గ పాత్రను చేశాడు. చాలా స్టైలిష్‌గా మోహన్‌బాబు ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఇక టీజర్‌లో వినిపించిన డైలాగ్‌ ప్రస్తుతం అందరికి పిచ్చెకిస్తోంది. రామాయణం మరియు మహాభారతంలో యుద్దాల్లో లక్షలాది మంది చనిపోయారు. అయినా కూడా రాముడు, కృష్ణుడులను దేవుడు అంటున్నారు. వారు దేవుళ్లు అయినప్పుడు నేనూ దేవుడినే అంటూ మోహన్‌బాబు చెబుతున్న డైలాగ్‌ అందరిలో ఆలోచనను రేకెత్తిస్తోంది.

అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో మదన్‌ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కించాడు అంటూ సమాచారం అందుతుంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ‘గాయత్రి’ చిత్రంను వచ్చే నెల 9న విడుదల చేయబోతున్నారు. శ్రియ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో నిఖిలా విమల్‌ అనే హీరోయిన్‌ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. మంచు విష్ణు, మోహన్‌బాఋ కలిసి చేస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి అంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.

పాట‌ల యుద్ధంగా మారిన మాట‌ల యుద్ధం

0

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు, కత్తి మ‌హేష్ మ‌ధ్య మాట‌ల యుద్ధం పాట‌ల యుద్ధంగా మారింది. అజ్ఞాత‌వాసి లో ప‌వ‌న్ ఆల‌పించిన కొడకా… కోటేశ్వ‌ర‌రావు ఖ‌రుసైపోత‌వురో… పాట‌ను ఆయ‌న ఫ్యాన్స్ స్ఫూఫ్ చేసి క‌త్తి మ‌హేష్ పై ప్ర‌యోగించారు. క‌త్తిని తిట్ట‌కుండానే తిడుతూ, కొట్ట‌కుండానే కొడతామ‌ని హెచ్చ‌రిస్తూ ఈ పాట విడుద‌ల చేశారు. ఒరిజిన‌ల్ సాంగ్ లో ఉన్న కొన్ని తిట్ల‌ను య‌థాత‌థంగా క‌త్తి మీద ప్ర‌యోగించ‌డం ద్వారా వినూత్న నిర‌స‌న‌ను ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇలా చూపిస్తున్నారు. ఈ పాట ఇప్పుడు నెట్ లో వైర‌ల్ అవుతోంది. దీనిపై క‌త్తి మ‌హేష్ స్పందించారు. పవ‌న్ ఫ్యాన్స్ పై మ‌రోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఈ నెల 15 వ‌ర‌కూ ఏమీ మాట్లాడొద్ద‌ని వారిలో వారే అనుకుని ఇలా చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. తాను కూడా సైలెంట్ గా ఉందామ‌ని అనుకుంటే ఉండ‌నివ్వ‌డం లేద‌ని ఆరోపించారు. కోన వెంక‌ట్ మీద గౌర‌వంతో తాను ఏమీ మాట్లాడ‌వ‌ద్ద‌ని అనుకున్నాన‌ని, త‌న‌పై ఇప్పుడు జ‌రుగుతున్న దాడికి ఆయ‌న బాధ్య‌త తీసుకుంటారా అని క‌త్తి ప్రశ్నించారు. ప‌వ‌న్ అభిమానులు దుర్మార్గుల‌ని, త‌న హ‌క్కుల‌పై దాడి చేయ‌వ‌ద్ద‌ని వేడుకుంటున్నా విన‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. క్యాన్స‌ర్ తో మ‌ర‌ణించిన త‌న త‌ల్లిని కూడా వాళ్లు వ‌దిలిపెట్ట‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. పోలీస్ కేసు పెట్టాల‌ని అనుకుంటే ఎన్ని లక్ష‌ల మందిపై కేసు పెట్టాల‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించి త‌న అభిమానుల‌ను క‌ట్ట‌డి చేయాల‌న్న‌దే త‌న కోరిక‌ని చెప్పుకొచ్చారు. ఆయ‌న ఒక్క‌మాట చెబితే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని అన్నారు.

కళ్యాణ్ రామ్ కొత్తగా… క్లాస్ గా.

0
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్న నందమూరి కుటుంబం నుంచి వచ్చే హీరోలు ఎవరికైనా మాస్ అప్పీల్ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికి ఆ హీరోలు కూడా ప్రయత్నించింది లేదు. ఎన్టీఆర్ లాంటి క్రౌడ్ పుల్లర్ మాత్రమే కాదు జయాపజయాలతో సంబంధం లేకుండా నడిచారు. కళ్యాణ్ రామ్ కూడా కూడా అదే బాటలో నడిచారు. ఇక ఆయన సొంతంగా చేసిన సినిమాలు అన్నీ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసినవే. అలాంటి కళ్యాణ్ రామ్ కొత్తగా, క్లాస్ గా ఉంటే ఎలా ఉంటుంది? ఊహకే కాస్త డిఫరెంట్ గా అనిపించిన ఈ ఆలోచనని నిజం చేసి చూపింది “నా నువ్వే “ టీం.

యాడ్ ఫిలిమ్స్ చేయడంలో మంచి పట్టున్న జయేంద్ర డైరెక్షన్ లో మహేష్ కోనేరు నిర్మాతగా చేస్తున్న సినిమాకి “ నా నువ్వే “ అని టైటిల్ పెట్టడమే ఆశ్చర్యం. ఆ టైటిల్ తో విడుదల అయిన టీజర్ చూస్తుంటే ఇంకాస్త షాక్ తప్పదు. దిగ్గజ కెమెరా మెన్ పీసీ శ్రీరామ్ కంటి కోణంలో చూసినప్పుడు కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ కళ్యాణ్ రామ్ యేనా నిన్నమొన్నటిదాకా పక్కా మాస్ సినిమాలు చేసింది అనిపిస్తోంది. ఇక “నా నువ్వే “ టీజర్ లో మరో హైలైట్ మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం సినిమా మీద మంచి ఇంప్రెషన్ తో పాటు కళ్యాణ్ కెరీర్ కొత్త మలుపు తీసుకోవడం గారంటీ అనిపిస్తోంది. కావాలంటే మీరు కూడా ఆ టీజర్ మీద ఓ లుక్ వేయండి.

అకౌంట్లో డబ్బులు వెయ్… ఆమెకి ఫోన్ చెయ్.

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సోషల్ మీడియా ని జనం ఎలా ఉపయోగిస్తున్నారో చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే. ఈ విషయంలో యు ట్యూబ్ వీడియోలతో హడావిడి చేస్తున్న స్వాతి నాయుడు ఇంకాస్త వెరైటీ. ఈ మధ్య ఏడుస్తూ ఎవరికో ఐ లవ్ యు అని చెబుతున్న స్వాతి నాయుడు ఇప్పుడు ఇంకో వీడియో తో ముందుకు వచ్చింది. ఈ వీడియో లో ఆమె చెప్పిన మ్యాటర్ వింటే మతి పోవడం ఖాయం. తన బ్యాంకు అకౌంట్ నెంబర్ చెప్పిన స్వాతి అందులో డబ్బులు వేసాక తనతో ఫోన్లో మాట్లాడవచ్చని ఆఫర్ ఇచ్చింది. అయినా మాట్లాడడానికి డబ్బులు ఏమిటో ? స్వాతి నాయుడు పెట్టిన ఈ వీడియో చూసి కుర్రకారు మాత్రం ఆమె అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ రాసుకునే పనిలో పడ్డారు. ఇంతకీ స్వాతి నాయుడు ఏమి చెప్పిందో మీరే చూడండి…

లవ్ ఫెయిల్యూర్ బాధలో స్వాతి నాయుడు?

0
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

స్వాతి నాయుడు… సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్ చూసే వాళ్ళు అందరికీ ఈ పేరు సురపరిచితం. అయితే శృంగార పరమైన దృశ్యాలు, సంచలన కామెంట్స్ చేస్తూ ఆమె ఎన్నో సార్లు నెటిజెన్ల దృష్టిని ఆకర్షించింది. ఆమెని ఎప్పుడూ అదే దృశ్యాల్లో చూస్తున్నవారికి అనుకోని షాక్ తగిలింది. ఈసారి ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఎందుకు ఏడుస్తుందో స్వాతి నాయుడు బయటపెట్టకపోయినా ఆమె మాటల్ని బట్టి చూస్తే ఏదో లవ్ ఫెయిల్యూర్ మ్యాటర్ లా అనిపిస్తోంది. తాను ప్రేమించిన వ్యక్తి దూరం అయితే తట్టుకోలేక స్వాతి నాయుడు అతన్ని తిరిగి రమ్మని కోరుతున్నట్టు ఆ వీడియోలో వుంది. కావాలంటే మీరు కూడా ఓ లుక్ వేయండి.

ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అంటూ వచ్చిన బన్నీ

0

allu arjun naa peru surya naa Illu india First Impact was released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో కొత్త కొత్త ట్రెండ్‌లు మొదలు అవుతున్నాయి. సినిమా ప్రమోషన్‌ విషయంలో క్రియేటివిటీని ఎక్కువగా వాడేస్తున్నారు. ఆడియో వేడుకలు, ట్రైలర్‌ రిలీజ్‌, ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ఒక్కో పాటను విడుదల చేయించడం.. ఇలా కొత్త కొత్త పద్దతిలో సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ మరో కొత్త ప్రమోషన్‌ పద్దతిని మొదలు పెట్టాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం‘నా పేరు సూర్య’. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటి నుండే సినిమాపై ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ చిత్రంకు సంబంధించిన ఒక వీడియోను ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అంటూ విడుదల చేశారు. తెలుగులో ఇలా ఒక సినిమాను విడుదల చేయడం ఇదే ప్రథమం అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్‌ పాత్ర ఏంటీ? అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు ఈ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అంటూ వచ్చిన బన్నీ అనుకున్నట్లుగానే నాపేరు సూర్య సినిమాపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాడు.

భారీ అంచనాలున్న ఈ సినిమాలో బన్నీ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ఈ వీడియోతో సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్‌ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. మార్చిలో సినిమా టీజర్‌ మరియు ట్రైలర్‌లను విడుదల చేయబోతున్నారు. బన్నీ ప్రారంభించిన ఈ కొత్త ప్రమోషన్‌ పద్దతి ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అనేది సినీ వర్గాల వారి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇకపై టాలీవుడ్‌లో ఫస్ట్‌ ఇంపాక్ట్‌ వీడియోలు వరుసగా వచ్చే అవకాశం ఉంది.

కొడకా కోటేశ్వరరావా… ఒక సంచలనం

0

pawan agnathavasi movie song release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోషన్‌ చేస్తున్నారు. పవన్‌ 25వ చిత్రం అవ్వడంతో త్రివిక్రమ్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ఈ చిత్రంకు సంబంధించిన కొడకా కోటేశ్వరరావా అంటూ సాగే పాటను నూతన సంవత్సర కానుకగా విడుదల చేయడం జరిగింది. పవన్‌ పాడిన ఈ ప్రత్యేక పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. వారం రోజు ముందే ఈ పాట విడుదలపై ప్రకటన చేసిన నేపథ్యంలో అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. 

కొన్ని నిమిషాల వ్యవదిలో మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుని సంచనలంగా మారిన పవన్‌ పాడిన కొడకా సాంగ్‌ టాలీవుడ్‌లో ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతుంది. న్యూ ఇయర్‌ పార్టీల్లో ఈ పాట తెగ వినిపించింది. పాట విడుదలైన కొన్ని నిమిషాల్లోనే పవన్‌ ఫ్యాన్స్‌ ఆ పాటకు స్టెప్పులు వేసి మరీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తమ అభిమానంను చూపించారు. 

సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంకు ఖచ్చితంగా కొడకా పాట హైలైట్‌గా నిలుస్తుందని, ఏమాత్రం అనుమానం లేకుండా ‘అజ్ఞాతవాసి’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ పవన్‌ పాడిన అత్తారింటికి దారేది పాట కంటే ఈ పాట మరింత సక్సెస్‌ అవ్వబోతుంది అంటూ సినీ వర్గాల వారు జోష్యం చెబుతున్నారు.

ట్రైలర్‌ రివ్యూ : ఏంటీ బాలయ్య మళ్లీ అవే డైలాగ్‌లేనా..?

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

balakrishna-jai-simha-trailer-review

ఈ సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని ఆ చిత్రం అందుకుంది. ఆ తర్వాత పూరి దర్శకత్వంలో ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని చేసి బొక్క బోర్లా పడ్డాడు. ఇక తాజాగా తమిళ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ‘జైసింహా’ అనే చిత్రాన్ని చేశాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘జైసింహా’ చిత్రం ఆడియో విడుదలైంది. అదే సమయంలో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం ముందు నుండి ఆశించినట్లుగా నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ చిత్రంలా ఉండబోతుంది. ట్రైలర్‌లో యాక్షన్‌ సీన్స్‌ మరియు డైలాగ్స్‌లు బాలయ్య గత చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలను గుర్తుకు తెస్తుంది.

balakrishna-jai-simha

నందమూరి ఫ్యాన్స్‌ను సంతోష పర్చిన ఈ చిత్రం సాదారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చలేదు. బాలయ్య మళ్లీ అవే భారీ డైలాగ్స్‌ చెబుతూ, యాక్షన్‌ సీన్స్‌లతో బోర్‌ కొట్టిస్తున్నాడని, బాలయ్య ఇంకా ఇలాంటివి ఎన్నాళ్లు చేస్తాడు అంటూ సాదారణ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. బాలయ్య నుండి కొత్తగా ఏమైనా చూడాలని సాదారణ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాని ఫ్యాన్స్‌ కోరిక మేరకు భారీ డైలాగ్స్‌, గుక్కతిప్పుకోకుండా చెప్పే డైలాగ్స్‌ను బాలయ్య చెబుతున్నాడు.

jai-simha-trailer-release

యాక్షన్‌ సీన్స్‌తో ‘జై సింహా’ చిత్రం ఏ స్థాయిలో ఉండబోతుందో ట్రైలర్‌లో చెప్పకనే చెప్పాడు. తప్పకుండా ఈ చిత్రం బాలయ్యకు నచ్చే విధంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే సాదారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరిస్తారు అనే నమ్మకం లేదని అంటున్నారు. బాలయ్యకు జోడీగా ఈ చిత్రంలో నయనతారతో పాటు నటాషా మరియు హరిప్రియలు నటిస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.