ఆ న్యూడ్‌ సీన్స్‌ సినిమాలో ఉంటే బాగుండేది : సంజన

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sanjana comments on nude scenes in dandupalya 2 movie

కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన ‘దండుపాళ్యం’ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమాకు తాజాగా సీక్వెల్‌ను చేయడం జరిగింది. ‘దండుపాళ్యం 2’ చిత్రం చేశారు. కన్నడంతో పాటు తెలుగులో కూడా దండుపాళ్యం 2 సందడి చేస్తోంది. మొదటి పార్ట్‌ మంచి సక్సెస్‌ అయిన నేపథ్యంలో రెండవ పార్ట్‌పై కూడా భారీ అంచనాలున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు దండుపాళ్యం 2 చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక కన్నడంలో ఈ సినిమా సెన్సార్‌ బోర్డు ముందుకు వెళ్లింది. కొన్ని న్యూడ్‌ సీన్స్‌ ఉండటంతో సెన్సార్‌ బోర్డు నిర్మొహమాటంగా తొలగించింది.

సంజన న్యూడ్‌గా ఉన్న ఆ వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. సెన్సార్‌ కట్స్‌కు గురైన ఆ వీడియో యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తుంది. సంజన పూర్తి న్యూడ్‌గా ఆ సీన్‌లో కనిపిస్తుంది. తాజాగా ఆ విషయమై సంజన మాట్లాడుతూ.. ఆ సీన్స్‌ కోసం చాలా కష్టపడ్డాం. చివరకు సెన్సార్‌ కట్స్‌కు గురైందని తెలిసి చాలా బాదపడ్డాను. తాను పడ్డ కష్టం వృదా అయ్యిందనే భావన ఉంది. ఆ సీన్స్‌ సినిమాలో ఉంటే చాలా బాగుండేదని, ఆ సీన్స్‌ను తొలగించడం వల్ల సినిమాకు పెద్ద నష్టం అని ఆమె చెప్పుకొచ్చింది. న్యూడ్‌ సీన్స్‌ చేసినందుకు సినిమాలో లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్న సంజనను చూసి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం న్యూడ్‌ సీన్స్‌ చేయడాన్నే తప్పుబడుతున్నారు.

మరిన్ని వార్తలు

సర్వత్రా ఉత్కంఠ

బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి మొదట బయటకు వచ్చేదెవరు?

నాగ్‌, నాని మల్టీస్టారర్‌ మూవీ..

సాయి పల్లవి కోసమైనా చూడాలనిపిస్తుంది

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

varun tej fidaa movie latest trailer

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. ఈ వారం ప్రేక్షకలు ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అయితే దిల్‌రాజు తనదైన మైండ్‌ను ఉపయోగించి మరో ట్రైలర్‌లను వదిలాడు. ఆ ట్రైలర్‌తో ప్రేక్షకులు సినిమాను చూడాలని అల్లాడిపోతున్నారు. ఈసారి ట్రైలర్‌లో హీరోయిన్‌ సాయిపల్లవిని హైలైట్‌ చేస్తూ చూపించడం జరిగింది.

మొదటి ట్రైలర్‌లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో పాటు, ఒక మూస తరహా సినిమాలా ‘ఫిదా’ ఉంటుంది అనే టాక్‌ వచ్చింది. దాంతో దిల్‌రాజు ప్రత్యేంగా కొత్త ట్రైలర్‌ను కట్‌ చేయించాడు. కొత్త ట్రైలర్‌కు అనూహ్యంగా మంచి స్పందన వచ్చింది. సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్‌ మరియు ఆమె అల్లరి పనులు మరియు వరుణ్‌, సాయి పల్లవిల మద్య రొమాన్స్‌ కోసం వెళ్లాలి అనిపించేలా ట్రైలర్‌ ఉంది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఫిదా’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో భారీగానే ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశిస్తున్నారు. వరుసగా విజయాలను అందుకుంటున్న దిల్‌రాజు ఈ సినిమాతో మరో సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు

నాగ్‌, నాని మల్టీస్టారర్‌ మూవీ..

డ్రగ్స్‌ కేసు : స్టార్స్‌కు డేట్లు ఇచ్చిన పోలీసులు

చిరు తర్వాత బాలయ్యతో..!

నాని ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌లు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Hero Nani Has Got Two Movie Projects Each Time

యువ హీరో నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. ఇప్పటి వరకు వరుసగా 7 విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా విడుదలైన ‘నిన్నుకోరి’ చిత్రం సక్సెస్‌తో నాని కెరీర్‌ మరింత పీక్స్‌కు వెళ్లింది. ప్రస్తుతం నానితో సినిమాలు నిర్మించేందుకు ప్రముఖ నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని తర్వాత రెండు సినిమాలు కన్ఫర్మ్‌ అయ్యాయి. నాని రెండు సినిమాలు కూడా సమాంతరంగా షూటింగ్‌ జరుపుకోబోతున్నాయి. నేడు ఒక్క రోజే నాని రెండు సినిమాల ప్రకటన వచ్చింది.

నాని 20వ చిత్రంగా దిల్‌రాజు నిర్మాణంలో ‘ఎంసీఏ’ అనే చిత్రం తెరకెక్కబోతుంది. శ్రీరాం వేణు దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. నాని మార్క్‌లో ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఆ సినిమాతో పాటే నాని 21వ చిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఆ సినిమాకు ‘కృష్ణార్జునయుద్దం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌తో సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ చిత్రాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈసారి ‘కృష్ణార్జున యుద్దం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒకటి ఈ సంవత్సరం చివర్లో మరోటి వచ్చే సంవత్సరం ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

 మరిన్ని వార్తలు:

ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన తాప్సి

చరణ్‌ ఫ్యాన్‌ ‘బాలధీరుడు’ మృతి

చరణ్‌ ఫ్యాన్‌ ‘బాలధీరుడు’ మృతి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Famous as Ram Charan's Fan Dies

రామ్‌ చరణ్‌ ‘మగధీర’ డైలాగ్‌ను గుక్క తిప్పుకోకుండా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన కుర్రాడు పరశురామ్‌. మగధీర డైలాగ్‌ను మాత్రమే కాకుండా ఏ డైలాగ్‌ను అయినా సునాయాసంగా ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా సింపుల్‌గా చెప్పగలిగిన పరశురామ్‌ను స్వయంగా రామ్‌ చరణ్‌ తన వద్దకు పిలిపించుకుని మాట్లాడిన విషయం తెల్సిందే. మెగా ఫ్యాన్‌ అయిన పరశురామ్‌ను చరణ్‌ చేరదీయడమే కాకుండా అతడి చదువుకు అయ్యే ఆర్థిక సాయంను కూడా చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు. పరశురామ్‌ పెద్దవాడు అయ్యి మంచిగా చదువుకుంటే తానే జాబ్‌ ఇస్తాను అని కూడా చరణ్‌ ప్రామీస్‌ చేశాడు. ఆ పరశురామ్‌ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. 

గత కొన్ని రోజులుగా పరుశురామ్‌ కామెర్ల వ్యాదితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు సరైన చికిత్స చేయించక పోవడంతో పరశురామ్‌ మృతి చెందినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కామెర్ల వ్యాదిని గుర్తించని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చూపించలేదు. దాంతో పరశురామ్‌ మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్థారించారు. పరశురామ్‌ మృతి పట్ల మెగా ఫ్యాన్స్‌ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషయం పట్ల రామ్‌ చరణ్‌ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతం ‘రంగస్థలం’ షూటింగ్‌లో ఉన్న చరణ్‌కు ఇప్పటికే ఈ విషయం తెలిసి ఉంటుంది. సోషల్‌ మీడియాలో అయినా చరణ్‌ స్పందిస్తాడేమో చూడాలి.

మరిన్ని వార్తలు

డెత్ సీక్రెట్ తెలుసు

వెంకటేష్ కుటుంబం అతని కుమార్తె వివాహం గురించి ధృవీకరించారు