బాలయ్యని కమ్మేసిన పూరి హీరో.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  
బాలయ్యని కమ్మేసిన పూరి హీరో. - Telugu Bullet

తాజాగా విడుదల అయిన “పైసా వసూల్ ” థియేట్రికల్ ట్రైలర్ చూస్తే బాలయ్య ఫాన్స్ కి మాత్రమే కాదు తెలుగు సినీ అభిమానులందరికీ పెద్ద షాక్ తగిలింది. దీనికి కారణం బాలయ్య, పూరి. ఇన్నాళ్లు బాలయ్యని కొత్తగా చూపిస్తామని చెప్పిన దర్శకులు ఎందరో వున్నారు గానీ నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చేసిన దర్శకుడు ఎవరూ లేరు.ఒక్క పూరి జగన్నాధ్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే …పైసా వసూల్ థియేట్రికల్ ట్రైలర్ చూస్తున్నంత సేపు బాలయ్య కన్నా పూరి మార్క్ ఎక్కువగా కనిపిస్తోంది. పూరి మార్క్ హీరో కమ్మేసిన బాలయ్య నిజంగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. బాలయ్య రఫ్ నెస్ లో కూడా ఇంత స్టైలిష్ గా కనిపించడం ఇదే తొలిసారి. పైసా వసూల్ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది పక్కనబెడితే బాలయ్యని ఇంతగా మార్చేసిన పూరీని మెచ్చుకుని తీరాల్సిందే. 100 సినిమాలు చేసాక కూడా ఓ దర్శకుడి అంచనాలకు తగ్గట్టు ఇంతగా మారిపోడానికి సిద్ధమైన బాలయ్యకి కూడా హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

మరిన్ని వార్తలు:

‘మహానుభావుడు’ మంచి రోజు ఫిక్స్‌

‘బిగ్‌బాస్‌’ ఇంట్లో తాప్సికి ఏం పని?

తెలుగు ‘వీఐపీ2’ పరిస్థితి ఏంటి?

“వివేగం” హాలీవుడ్ లెవెల్ సినిమా…ఇదిగో ట్రైలర్.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

Vivegam Official Trailer

తమిళ్ టాప్ హీరో అజిత్ తాజా చిత్రం “వివేగం” రిలీజ్ కి ముందే సంచలనం సృష్టిస్తోంది. కొద్ది గంటల ముందు వచ్చిన ఆ సినిమా ట్రైలర్ చూస్తే ఎవరికైనా ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇంతకుముందు అజిత్ తో వేదాళం, వీరం వంటి సూపర్ డూపర్ హిట్ లు తీసిన దర్శకుడు శివ ఇప్పుడు వివేగం తో తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నాడు. ఎప్పటికైనా అజిత్ తో హాలీవుడ్ స్థాయి సినిమా తీయాలని కలలు కన్నాడు. ఆ కలని నిజం చేయడానికి అజిత్ ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా షూటింగ్ టైం లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అయినా దెబ్బ తగిలిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో రిస్కీ షాట్స్ చేసాడు అజిత్. అందుకే వివేగం ట్రైలర్ చూసిన వాళ్లంతా హాలీవుడ్ స్థాయి సినిమా చూసినట్టు ఉందంటున్నారు.

మరిన్ని వార్తలు:

గప్ చుప్… టాప్ సీక్రెట్

లవ, కుశలు సిద్దం అవుతున్నారు

‘సాహో’ బ్యూటీ పారితోషికం ఎంతో తెలుసా?

స్పైడర్ టీజర్ సూపర్బ్…మహేష్ అదుర్స్.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Spyder Telugu Teaser

ఎప్పటినుంచో మహేష్ అభిమానుల్ని ఊరిస్తూ వచ్చిన దర్శకుడు మురుగదాస్ ఎట్టకేలకు స్పైడర్ టీజర్ రిలీజ్ చేసాడు. ఈ టీజర్ మహేష్ అభిమానుల్ని ఉర్రుతలూగిస్తోంది. మాములుగా స్పైడర్ అన్న టైటిల్ అనుకున్న దగ్గర నుంచి మహేష్ మూవీలో టెక్నాలజీ డామినేట్ చేస్తుందేమో అన్న అభిప్రాయం చాలా మందికి కలిగింది. కానీ తాజా టీజర్ లో ఆ ఛాయలు బయటికి కనపడకుండా మురుగదాస్ జాగ్రత్త పడ్డాడు. ఓ మంచి మాస్ సినిమా తరహాలో టీజర్ రూపొందించి సూపర్బ్ అనిపించాడు. అందులో మహేష్ అదుర్స్ అనిపించాడు.


మరిన్ని వార్తలు:

సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?

ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు

శింబు ఓవియాతో పెళ్లా…?

అసిస్టెంట్ ని కొట్టిన బాలయ్య … వైరల్ వీడియో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

balakrishna beats his assistant in 102 movie opening
నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నాడు. ఈ మద్య తన అభిమానులను లేదా సహాయక సిబ్బందిని లేదా చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఎవరినో ఒకరిని కొడుతూ ఉండటం వల్ల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తున్నాడు. బాలకృష్ణ తాజాగా తన 102వ చిత్రాన్ని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభించుకున్నారు. ఈ ప్రారంబోత్సవ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు మరియు మీడియా వారు పాల్గొనడం జరిగింది. అంతా సందడిగా ఉన్న సమయంలో, అందరు చూస్తుండగానే బాలయ్య తన వ్యక్తిగత సహాయకుడిపై చేయి చేసుకున్నాడు. అది కాస్త ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతుంది. బాలయ్య మళ్లీ చేయి చేసుకున్నాడు అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే ఒక అభిమాని ఫొటో తీసుకునేందుకు పక్కకు రాగా నిర్దాక్షిణ్యంగా నెట్టేశాడు. మరో అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ఫోన్‌లాగేసుకుని ఒక్కటి పెట్టాడు. ఇలా బాలయ్య సోషల్‌ మీడియాలో విమర్శల పాలు అవుతున్నాడు. మొదటి నుండి కూడా బాలయ్యది ఇదే తీరు. కాకుంటే ఇటీవల సోషల్‌ మీడియా పుణ్యమా అని ఆ కొట్టే దెబ్బలు అందరు చూస్తున్నారు. వ్యక్తిగత సిబ్బందిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం బాలయ్య మొదటి నుండి చేస్తూనే ఉన్న పని అని ఆయనకు సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు. బాలయ్య ఇప్పటికైనా తీరు మార్చుకుంటే బాగుంటుందని ఆయన అభిమానులు స్వయంగా అంటున్నారు.

మరిన్ని వార్తలు:

జోగేంద్ర యువ గర్జనలో బిత్తిరి సత్తి సందడి

‘లై’తో మహేష్‌కు సంబంధం ఏంటి?

లవకుమార్‌ వచ్చేస్తున్నాడోచ్‌..!

సుమంత్‌ మరో ప్రయత్నం ‘మళ్లీ రావా..’

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

MalliRaava Teaser
అక్కినేని వారి ఇంటి నుండి దాదాపు రెండు దశాబ్దాల క్రితం హీరోగా పరిచయం అయిన సుమంత్‌ ఇప్పటి వరకు కూడా హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. ఇక తాను హీరోగా సక్సెస్‌ కాను అనుకున్నాడేమో సినిమాలు చాలా తగ్గించాడు. దాదాపు రెండు సంవత్సరాలకు ఒక్కటి అన్నట్లుగా సుమంత్‌ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా సుమంత్‌ ‘మళ్లీ రావా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుమంత్‌ సినిమా అంతకు ముందు ఆ తర్వాత వచ్చి చాలా కాలం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు సుమంత్‌ సినిమా అనగానే ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ‘మళ్లీ రావా’ సినిమా టీజర్‌ను నేడు వదిలారు. టీజర్‌ చూస్తుంటే కథ కాస్త ఆసక్తిగా ఉండేట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్‌గా తెలిసిన స్టార్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసుకుని ఉంటే బాగుండేది. సినిమా కథను చూస్తుంటే హీరోయిన్‌ ప్రధానంగా సాగేలా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొత్త హీరోయిన్‌ను అది కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకుండా ఉన్న ఫేస్‌ను చూడటం అంటే కష్టమే. సరే హీరోయిన్‌ ఎలా ఉన్నా సుమంత్‌ బాడీ లాంగ్వేజ్‌ మరియు బాడీ కూడా పాత చింతకాయ పచ్చడి తరహాలోనే ఉంది. కాస్త కొత్తగా, విభిన్నమైన లుక్‌తో ట్రై చేస్తే బాగుండేది. సరే లుక్స్‌ ఎలా ఉన్నా సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

మరిన్ని వార్తలు:

నక్షత్రం ప్రివ్యూ.

స్పైడర్‌ 16 కోట్లు.. జై లవకుశ 10 కోట్లు

మెగా అమ్మాయి తర్వాత మంచు అమ్మాయి

అనంతలో రైతు డాన్స్ వేస్తే … వైరల్ వీడియో

0

అనంత రైతు డ్యాన్సు చేస్తే…… ⬇️ఈ ఫ్రెండ్స్ కోసం పేజి కానీ మీకు నచ్చితే like చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్

Publié par Friends kosam sur mercredi 26 juillet 2017

నిరాశ పర్చిన ‘జవాన్‌’ టీజర్‌

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jawan teaser

‘విన్నర్‌’ చిత్రంతో ఆకట్టుకోలేక సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం బివిఎస్‌ రవి దర్శకత్వంలో ‘జవాన్‌’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. వాంటెడ్‌ చిత్రంతో దర్శకుడిగా మారి సక్సెస్‌ కాలేకపోయిన రవి మలి ప్రయత్నంగా ఈ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై మొదటి నుండి కూడా అంచనాలు పెద్దగా లేవు. దర్శకుడు ఈ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తాడని సినీ వర్గాల వారు కూడా భావించడం లేదు. సినిమా విడుదలకు సిద్దం అయినా కూడా ఇంకా ఎవరు దీని గురించి మాట్లాడుకోవడం లేదు. సినిమా ఫస్ట్‌లుక్‌ సమయంలో కూడా ఎవరు పెద్దగా ఈ సినిమాను పట్టించుకోలేదు. తాజాగా టీజర్‌ విడుదలైంది. 

టీజర్‌ సాదా సీదాగా ఉంది, ఏమాత్రం ఆకట్టుకునే అంశాలు కనిపించడం లేదు. ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా అనిపిస్తుంది. దేశ భక్తి నేపథ్యం సినిమా అవ్వడంతో కాస్త ఆసక్తి అనిపిస్తున్నా కూడా రొటీన్‌ విజువల్స్‌ మరియు రొటీన్‌ డైలాగ్స్‌తో టీజర్‌ ఆకట్టుకోలేక పోయింది. టీజర్‌తో అయినా సినిమా గురించి మాట్లాడుకుంటారని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశించారు. కాని ఇప్పుడు కూడా ప్రేక్షకులు  ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారనే హోప్స్‌ లేవు. ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌కు జోడీగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కారణంగా బిజినెస్‌ బాగానే జరగవచ్చు అని అంటున్నారు.

 

మరిన్ని వార్తలు:

ఇలా పూరికి మాత్రమే సాధ్యం

మళ్లీ ‘జై లవకుశ’కు లీక్‌ సమస్య

పోసానిపై వర్మ ఘాటు వ్యాఖ్యలు

పైసా వసూల్ స్టంపర్ అదిరిందిగా… వీడియో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిమిషంన్నర నిడివి.ఒక్కో డైలాగ్ ఒక్కో డైనమైట్ .సారీ…వంద డైనమైట్ లతో సమానం. బాలయ్య ని పూరి కొత్తగా చూపించాడు అంటే రొటీన్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం బాలయ్యకి కొత్త కాదు. అవి రాయడం పూరికి వెన్నతో పెట్టిన విద్య. ఇంకేముంది? భూమి,ఆకాశం బద్దలు అయ్యేలా డైలాగ్స్, ఫైట్స్, డాన్స్ మూవ్ మెంట్స్ ఓ మెరుపులా చూపించిన పైసా వసూల్ స్టంపర్ నిజంగా పైసా వసూల్. మొత్తానికి పూరి పాత బాలయ్యని కొత్తగా చూపించి ఈ స్టంపర్ తో బాలయ్య అభిమానుల అంచనాలు పెంచేసాడు. ఒకప్పుడు పూరికి సినిమా ఎందుకు గొణిగిన వాళ్ళే ఈ స్టంపర్ చూసి జై బాలయ్యకి తోడుగా జై పూరి అనేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ఛార్మిపై కానిస్టేబుల్‌ చేయి

సంపూ వెళ్లడం ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం

వై.వి.ఎస్ చౌదరి గొంతు లేచింది.

ఆ స్కూల్ కి చుక్కలు చూపించిన అధికారి…వీడియో

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

deputy DEO fires on Sri Chaitanya Techno School maintenance

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మొత్తం విద్యావ్యవస్థనే గుప్పిట్లో పెట్టుకున్నట్టు వ్యవహరించడం సర్వ సాధారణం అయిపోయింది. అదే అలవాటుతో ఓ స్కూల్ ఇనస్పెక్షన్ కి వచ్చిన ఓ డిప్యూటీ డీఈఓ తో యాజమాన్యం అదే రీతిలో సమాధానం ఇచ్చింది. దీంతో మండిపోయిన ఆ అధికారి సదరు స్కూల్ యాజమాన్యానికి చుక్కలు చూపించారు. విద్య శాఖ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. ఈ వ్యవహారానికి మంగళగిరి పోస్ట్ ఆఫీస్ దగ్గర నడుస్తున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వేదిక అయ్యింది . పాఠశాలలో కనీస అవసరాలకు నోచుకోని విద్యార్థుల కష్టం గురించి ఆ అధికారి ఎలా ప్రశ్నిస్తున్నాడో మీరే చూడండి…

Dikirim oleh Telugu Bullet pada 27 Juli 2017

మరిన్ని వార్తలు

మోడీ ట్వీట్ చూసి బిత్తరపోయిన జగన్ ?

రాహుల్ గాంధీ విలాపం ఎందుకు..?

ఓ సీటూ రేపు రా..!

 ట్రైలర్‌, టీజర్‌.. ఇప్పుడు స్టంపర్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Balakrishna Puri Jagannadh Paisa Vasool Stumper

కొన్ని సంవత్సరాల ముందు వరకు సినిమాలు వస్తే తప్ప అందులో ఉండే సీన్స్‌ ఏంటి అనేవి తెలిసేది కాదు. పోస్టర్‌లు వేస్తే అందులో హీరో ఎలా ఉంటాడు, హీరోయిన్‌ ఎలా ఉండబోతుంది అనే విషయాు తెలిసేవి. కాని కాలం మారిపోతుంది, టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌ అంటూ విడుదల చేయడం మొదలు పెట్టారు. ట్రైలర్‌ చూస్తే సగం సినిమా అర్థం అవుతుంది. కొన్ని ట్రైలర్‌లు సినిమాలపై అంచనాలను అమాంతం పెంచడంతో పాటు కొన్ని ట్రైలర్‌లు సినిమా ఇదేనా అన్నట్లుగా ఉండేవి. ట్రైలర్‌లు కనీసం రెండు నిమిషాల నుండి అయిదు నిమిషాల వరకు ఉంటాయి. ఇక ట్రైలర్‌ల తర్వాత టీజర్‌లు. కొన్ని సెకన్ల నిడివితో ఉండే ఈ  టీజర్‌లు ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. 

ట్రైలర్‌లు, టీజర్‌లు సినిమాలపై ఒక అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. కాలం మారుతుంది, అలాగే సినిమా పద్దతి, పబ్లిసిటీ విధానం కూడా మార్చుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ట్రైలర్‌, టీజర్‌ల తర్వాత స్టంపర్‌లు వస్తున్నాయి. ఈ స్టంపర్‌లు ఏంటి అనేది ఇంకా తెలియదు. తెలుగులో మొదటి సారిగా బాలయ్య సినిమాకు స్టంపర్‌ విడుదల కాబోతుంది. బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ను మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో సినిమా స్టంపర్‌ను విడుదల చేయబోతున్నారు. స్టంపర్‌ విభిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఇది సక్సెస్‌ అయితే మిగిలిన వారు కూడా అంతా ఇదే ఫాలో అవుతారేమో. టాలీవుడ్‌లో ముందు ముందు అన్ని సినిమాలకు స్టంపర్‌లను విడుదల చేస్తారేమో చూడాలి.


మరిన్ని వార్తలు

ఛార్మిపై కానిస్టేబుల్‌ చేయి

సంపూ వెళ్లడం ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం

వై.వి.ఎస్ చౌదరి గొంతు లేచింది.

 

ఛార్మిపై కానిస్టేబుల్‌ చేయి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్‌ కేసులో నేడు సిట్‌ ముందు హీరోయిన్‌ ఛార్మి హాజరు అయిన విషయం తెల్సిందే. సిట్‌ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మహిళ అధికారి సమక్షంలోనే ఛార్మి విచారణ జరుగుతుంది. ఇక సిట్‌ కార్యలయంకు ఆమె ఎంటర్‌ అయిన సమయంలో కాస్త గందరగోళం ఏర్పడటం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఎక్కువ మంది ఛార్మితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. వారిని వారించే క్రమంలో ఒక కానిస్టేబుల్‌ చేయి ఛార్మిపై పడటం జరిగింది. దాంతో ఆగ్రహం చెందిన ఛార్మి ఆ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసింది.

ధర్యాప్తు బృందం సభ్యులు తన విచారణ ప్రారంభించడానికి ముందు తనపై చేయి వేసిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్‌ చేసింది. అప్పుడే తాను విచారణకు సహకరిస్తాను అంటూ భీష్మించుకు కూర్చుందట. దాంతో సిట్‌ అధికారులు ఆ కానిస్టేబుల్‌పై విచారణకు ఆదేశించారు. విచారణలో ఉద్దేశ్యపూర్వకంగా ఛార్మిపై అతడు చేయి వేసినట్లుగా తేలితే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఛార్మి విచారణకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఛార్మిని సిట్‌ అధికారులు పలు విషయాపై ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఛార్మికి ఉందని బలమైన ఆధారాలు పోలీసులు సంపాదించారు. వాటిని చూపించి సిట్‌ అధికారులు విచారించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

సంపూ వెళ్లడం ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం

జైలవకుశ ఆడియో, రిలీజ్ డేట్స్ వచ్చేసాయి.

ఛార్మి ముందు ఉంచే ప్రశ్నలు ఇవే

ఈ వీడియో చూస్తే ముద్రగడ పేదరికం కనిపిస్తుంది.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

mudragada padmanabham kept in drone camera in kirlampudi

ముద్రగడ పాదయాత్ర అనగానే సహజంగానే మీడియా ఫోకస్ అంతా ఆయన స్వగ్రామం కిర్లంపూడి మీద ఉంటుంది. అయితే ఈసారి ఛానెల్స్ వ్యవహారశైలి చూస్తుంటే అంతకుముందులా పరిస్థితి కనిపించడం లేదు. దీనికి టీడీపీ సర్కార్ మీడియా మేనేజ్ మెంట్ కొంత కారణం అయితే డ్రగ్స్ కేసు విచారణకి సంబంధించి సంచలనం రేపుతున్న జ్యోతిలక్ష్మి ఫేమ్ నటి ఛార్మి ఎపిసోడ్ ఇంకో కారణం.

అటు మీడియా కెమెరాల దృష్టి కాస్త తగ్గిందేమో గానీ కిర్లంపూడి లో ఇంకో తరహా కెమెరాలు బాగా పనిచేస్తున్నాయి. ముద్రగడ వ్యూహాలు తెలుసుకోడానికి పోలీసులు, పోలీస్ ఆనుపానులు తెలుసుకునేందుకు ముద్రగడ అనుచరులు రహస్యంగా అక్కడక్కడా సీసీ టీవీ కెమెరాలు అమర్చారు. ఈ కోవలోనే ఓ డ్రోన్ కెమెరా నుంచి వచ్చిన దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మాటకి ముందు ఒక్కసారి మాటకి తరువాత ఒకసారి తాను పేదవాడిని, అల్పుడిని అని ముద్రగడ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుస్తుంది. ముద్రగడ ఇంటి పరిసరాలు చూస్తే ఆయన చెప్పే పేదరికం ఏ పాటిదో మీకే అర్ధం అవుతుంది.

మరిన్ని వార్తలు

వైసీపీకి మరో ఛానెల్ అండ

ఆ జ్యూస్ తాగితే డ్రగ్స్ కేసు నుంచి రిలీఫ్ ?

వైసీపీ లో ఈ 30 మందికి టిక్కెట్లు ఖరారు?

సినిమాల్లోకి రాకముందే ఆ హీరోయిన్ తో చరణ్…సెన్షేషనల్ వీడియో.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ram charan tej sriya perform together in acting school

సినిమాల్లోకి వచ్చాక చరణ్ ఎలా వున్నాడు ? ఎలా యాక్ట్ చేస్తున్నాడు అన్నది అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లోకి రాకముందు చరణ్ ఎలా ఉండేవాడు ? ఎలా యాక్ట్ చేసేవాడు ? ఏమైనా శిక్షణ తీసుకున్నాడా ? ఇలాంటి సందేహాలన్నిటినీ తీర్చే వీడియో ఒకటి బయటపడింది. సినిమాల్లో చేరడానికి ముందు చరణ్ ముంబై లో ట్రైనింగ్ అయ్యాడు. అప్పుడు చరణ్ ట్రైనింగ్ తీసుకుంటున్న కేంద్రానికి వచ్చిన శ్రీయ అతనితో కలిసి ఓ సన్నివేశంలో నటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తోంది. ఆ వీడియో ఇప్పుడు మీ కోసం.

మరిన్ని వార్తలు

బాబాయ్, అబ్బాయి లాభాలు చూస్తున్నారు.

ఫిదా’ అయ్యి వరాలు ప్రకటించిన కేసీఆర్‌

పిక్‌టాక్‌ : నారా రోహిత్‌ ఇలా అయ్యాడు ఏంటి?

ఆ బామ్మ అహ నా పెళ్ళంట అంటే కేకో కేక .

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

old women dance to savitri aha naa pelliyanta song

మాయాబజార్ సినిమాలో సావిత్రి అహ నా పెళ్లంట పాటకి చేసిన స్టెప్స్, ఇచ్చిన హావభావాలు ఒక్కసారి చూస్తే ఇక ఎప్పటికీ మర్చిపోము. ఆ పాటకి ఇంకెవరైనా డాన్స్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా రాదు మనకి. కానీ ఓ బామ్మ గారు ఆ పాటకి చేసిన డాన్స్ చూస్తే మాత్రం కేకో కేక అనక మానరు.

 

‘ఆనందోబ్రహ్మ’ ట్రైలర్‌ రివ్యూ

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 anando brahma theatrical trailerటాలీవుడ్‌లో హర్రర్‌ కామెడీ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. ‘ప్రేమకథా చిత్రమ్‌’ తర్వాత హర్రర్‌ కామెడీ సినిమాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. కాని అందులో కొన్ని మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. తాజాగా అదే జోనర్‌లో వస్తున్న చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. తాప్సి ప్రధాన పాత్రలో నటించడం ఈ సినిమా ప్రత్యేకత. ‘గీతాంజలి’ చిత్రంలో హీరోగా నటించిన శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అన్ని సినిమాల్లో దెయ్యాలను చూసి మనుషులు భయపడుతూ ఉంటారు. కాని ఈ సినిమాలో మాత్రం మనుషులను చూసి దెయ్యాలు భయపడుతూ ఉంటాయి.

ఒక ఇంట్లో కొన్ని దెయ్యాలు తిష్టవేసుకుని ఉన్నాయి. ఆ ఇంటికి శ్రీనివాస్‌రెడ్డి అండ్‌ టీం ఎంట్రీ ఇస్తుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందనే విషయం గుర్తించి వారు ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో దెయ్యాలు భయపడుతూ ఉంటాయి. ట్రైలర్‌తో ఈ విషయంను స్పష్టంగా చెప్పిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై అమితాశక్తిని కలిగించారు. ఇది మరో ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘గీతాంజలి’ అవుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌ మరియు షకలక శంకర్‌ల కామెడీ సినిమాకు హైలైట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో తాప్సి తెలుగులో మరోసారి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఆమె కోరిక తీరేనా చూడాలి.

మరిన్ని వార్తలు:

మధుప్రియ కాస్త ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యింది

ఫిదా మూవీ ప్రివ్యూ.

‘సీతయ్య’ దర్శకుడు ఆత్మహత్య యత్నం

మిత్రులే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

puri jagannadh posted video in twitter after SIT interrogation

డ్రగ్స్‌ వ్యవహారంలో సిట్‌ అధికారుల ముందు విచారణకు హాజరు అయిన పూరి జగన్నాధ్‌ అరెస్ట్‌ అయ్యాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంకా పూరికి సంబంధించిన పలు విషయాలను, వివాదాలను మీడియా ప్రసారం చేసింది. కొన్ని టీవీ ఛానెల్స్‌ మరీ దారుణంగా పూరిపై అక్కస్సు వెళ్లగక్కాయి. సిట్‌ విచారణ ముగించుకుని ఇంటికి చేరుకున్న పూరి జగన్నాథ్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ఆయన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. మీడియాలో వస్తున్న వార్తల కారణంగా తన తల్లి, భార్య, పిల్లలు నాలుగు రోజులుగా ఏడుస్తున్నారని, తాను ఏ తప్పు చేయకున్నా కూడా మీడియాలో వార్తలు వారిని ఇబ్బంది పెడుతున్నాయని అన్నాడు.

మీడియాలో తనకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు. తన ప్రతి సినిమా సమయంలో టీవీ ఛానెల్స్‌కు చెందిన మిత్రులను కలుస్తూ ఉంటాను. కొందరు చాలా ఆప్తులు కూడా ఉన్నారు. కాని ఇప్పుడు వారే నా జీవితంను నాశనం చేసేలా వార్తలు సృష్టిస్తున్నారు, తనపై అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారు. ముందు ముందు కూడా మీడియా వారు మళ్లీ నన్ను కలవడం, వారిని నేను కలవడం ఉంటుంది. కాని ఆ విషయాన్ని గుర్తించకుండా తనపై దారుణంగా కథనాలు రాస్తున్నారు అంటూ పూరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పూరి ట్విట్టర్‌లో పెట్టిన వీడియోకు అనూహ్య స్పందన వస్తుంది. ఆయన అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్ని ఆరోపణలు మీపై వచ్చినా మాకు మీపై ఉన్న అభిమానం తగ్గదు అంటూ అభిమానులు ట్వీట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

‘సీతయ్య’ దర్శకుడు ఆత్మహత్య యత్నం

మంచు లక్ష్మి రాజకీయ విమర్శలు

అరెస్ట్‌ అంటూ వార్తలు, సిట్‌ ఆఫీస్‌కు పూరి భార్య