ఛార్మిపై కానిస్టేబుల్‌ చేయి

police constable touches Charmi At SIT Office

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్‌ కేసులో నేడు సిట్‌ ముందు హీరోయిన్‌ ఛార్మి హాజరు అయిన విషయం తెల్సిందే. సిట్‌ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మహిళ అధికారి సమక్షంలోనే ఛార్మి విచారణ జరుగుతుంది. ఇక సిట్‌ కార్యలయంకు ఆమె ఎంటర్‌ అయిన సమయంలో కాస్త గందరగోళం ఏర్పడటం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఎక్కువ మంది ఛార్మితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. వారిని వారించే క్రమంలో ఒక కానిస్టేబుల్‌ చేయి ఛార్మిపై పడటం జరిగింది. దాంతో ఆగ్రహం చెందిన ఛార్మి ఆ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసింది.

ధర్యాప్తు బృందం సభ్యులు తన విచారణ ప్రారంభించడానికి ముందు తనపై చేయి వేసిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్‌ చేసింది. అప్పుడే తాను విచారణకు సహకరిస్తాను అంటూ భీష్మించుకు కూర్చుందట. దాంతో సిట్‌ అధికారులు ఆ కానిస్టేబుల్‌పై విచారణకు ఆదేశించారు. విచారణలో ఉద్దేశ్యపూర్వకంగా ఛార్మిపై అతడు చేయి వేసినట్లుగా తేలితే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఛార్మి విచారణకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఛార్మిని సిట్‌ అధికారులు పలు విషయాపై ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఛార్మికి ఉందని బలమైన ఆధారాలు పోలీసులు సంపాదించారు. వాటిని చూపించి సిట్‌ అధికారులు విచారించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

సంపూ వెళ్లడం ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం

జైలవకుశ ఆడియో, రిలీజ్ డేట్స్ వచ్చేసాయి.

ఛార్మి ముందు ఉంచే ప్రశ్నలు ఇవే