చరణ్‌ ఫ్యాన్‌ ‘బాలధీరుడు’ మృతి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Famous as Ram Charan's Fan Dies

రామ్‌ చరణ్‌ ‘మగధీర’ డైలాగ్‌ను గుక్క తిప్పుకోకుండా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన కుర్రాడు పరశురామ్‌. మగధీర డైలాగ్‌ను మాత్రమే కాకుండా ఏ డైలాగ్‌ను అయినా సునాయాసంగా ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా సింపుల్‌గా చెప్పగలిగిన పరశురామ్‌ను స్వయంగా రామ్‌ చరణ్‌ తన వద్దకు పిలిపించుకుని మాట్లాడిన విషయం తెల్సిందే. మెగా ఫ్యాన్‌ అయిన పరశురామ్‌ను చరణ్‌ చేరదీయడమే కాకుండా అతడి చదువుకు అయ్యే ఆర్థిక సాయంను కూడా చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు. పరశురామ్‌ పెద్దవాడు అయ్యి మంచిగా చదువుకుంటే తానే జాబ్‌ ఇస్తాను అని కూడా చరణ్‌ ప్రామీస్‌ చేశాడు. ఆ పరశురామ్‌ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. 

గత కొన్ని రోజులుగా పరుశురామ్‌ కామెర్ల వ్యాదితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు సరైన చికిత్స చేయించక పోవడంతో పరశురామ్‌ మృతి చెందినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కామెర్ల వ్యాదిని గుర్తించని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చూపించలేదు. దాంతో పరశురామ్‌ మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్థారించారు. పరశురామ్‌ మృతి పట్ల మెగా ఫ్యాన్స్‌ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషయం పట్ల రామ్‌ చరణ్‌ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతం ‘రంగస్థలం’ షూటింగ్‌లో ఉన్న చరణ్‌కు ఇప్పటికే ఈ విషయం తెలిసి ఉంటుంది. సోషల్‌ మీడియాలో అయినా చరణ్‌ స్పందిస్తాడేమో చూడాలి.

మరిన్ని వార్తలు

డెత్ సీక్రెట్ తెలుసు

వెంకటేష్ కుటుంబం అతని కుమార్తె వివాహం గురించి ధృవీకరించారు