విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్స్

విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్స్

ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా సరే జగన్ మరియు అతని బృందం తాము అనుకున్న నిర్ణయాన్నే ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎన్ని ప్రాణాలు పోయినా సరే జగన్ సర్కార్ ఏపీలో అసలేం పట్టనట్టుగా వ్యవహరించడం గమనార్హం.అయితే రాజధానిగా అమరావతినే ఉంచాలని ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఆటోమాటిక్ గా జగన్ మరియు అండ్ కో కు శత్రువులుగా మారిపోతున్నారు.

అలా ఓ ప్రముఖ పత్రిక యజమానిని ఉద్దేశించి విజయసాయి రెడ్డి కొన్ని సంచలన ట్వీట్స్ పెట్టారు.అయితే వారికి వారికి వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ వాళ్ళేదో చేసారని ప్రజలను ఇబ్బందులకు గురి చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా అందుకే ఇలా ట్వీట్స్ చేసిన విజయసాయి రెడ్డికు నెటిజన్స్ దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తున్నారు.మీరు చెప్తున్నా కారణం ప్రకారం టీడీపీ నేతలు అవినీతి చేసారు అనుకుందాం..

అలా చేసినట్టయితే వారి మీద చట్టరీత్యా అధికారంలో ఉన్న మీరు చర్యలు తీసుకొని చంద్రబాబు సహా ఆయన బినామీలు అందరినీ లోపల వేయించండి ఎవరొద్దన్నారు?కానీ దానికి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.అంతే కాకుండా మీలాంటి జైలుకి వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా నీతులు చెప్తే మాకు వినాల్సిన ఖర్మ పట్టుకుంది అని అలాగే ఏవన్నా పథకాల ఓపెనింగ్ కు అయితే జగన్ బయటకు వస్తే మీరేమో ఇక్కడ సీఎం రేంజ్ లో పెర్ఫామెన్స్ చేస్తున్నారని నెటిజన్స్ ఫైరవుతున్నారు.