సుశాంత్ మృతి పై స్పందించిన విజయశాంతి

సుశాంత్ మృతి పై స్పందించిన విజయశాంతి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు యావత్ సినీ రంగంలో కలకలం రేపుతుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసుపై టాలీవుడ్ సీనియర్ నటి, తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయని, దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ, సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు.

అయితే ఆ కేసుల్లో వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయని, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని అన్నారు. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకేలా ఉన్నప్పుడే న్యాయాన్ని ఆశించగలమని సాల్వే అన్నారని, ఇలాంటి ఎన్నో సంచలనాత్మక కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు ఆధారాల్ని సమర్పిస్తాయి కానీ వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం అని అన్నారు.

దర్యాప్తు, విచారణ అనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలని, ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందించారు. కానీ, వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగేలా ఈ స్థాయిలో విచారణ, దర్యాప్తు జరిగాయా అని ప్రశ్నించారు. ఎందరో నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే నామమాత్రంగా కేసులు నమోదు, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడం చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు విస్మయం కలిగిస్తున్నాయని అన్నారు.