13 ఏళ్ల తర్వాత మహేశ్ బాబు తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రముఖ నటి

13 ఏళ్ల తర్వాత మహేశ్ బాబు తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రముఖ నటి

అలనాటి సీనియర్ నటి.. ప్రస్తుత మహిళా నాయకురాలు విజయశాంతి మళ్లీ నటనవైపు మొగ్గు చూపి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సుమారు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వచ్చిన రాములమ్మ మరోసారి తానేంటో నిరూపించుకునేందుకు రె‘ఢీ’గా ఉంది. మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమా సెకండ్ షూట్‌లో రాములక్కకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేశారు. అంతేకాదు.. సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది. కాలేజీ లెక్చలర్‌ పాత్రలో కనిపిస్తుందని.. రాయలసీమకు చెందిన ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుందని

అయితే.. ఇంతవరకూ మహేశ్‌కు సంబంధించిన లుక్స్‌ను మాత్రమే రివీల్ చేసిన దర్శకనిర్మాతలు.. హీరోయిన్ లుక్ కానీ, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విజయశాంతి లుక్‌ను కూడా రివీల్ చేయలేదు. సస్పెన్స్‌లో ‘సరిలేరు నాకెవ్వరు..’ అంటూ దర్శకుడు అనీల్ రావిపూడి ముందుకెళ్తున్నాడు. కాగా.. దీపావళికి విజయశాంతి ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తారని తెలుస్తోంది.

కాగా.. లాంగ్ గ్యాప్ తర్వాత రాములమ్మ నటిస్తుండటంతో స్క్రీన్‌పై ఎలా ఉండబోతోంది..? రీ ఎంట్రీతో వస్తున్న పాత్రకు ఏ మాత్రం న్యాయం చేసింది..? అసలు ఆమె పాత్ర ఎలా ఉంది..? అని రాజకీయ, సినీ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. లుక్ కోసం దీపావళి వరకు.. పాత్ర తెలుసుకోవాలంటే జనవరి 12 వరకు అభిమానులు వేచిచూడక తప్పదు మరి.