మహేష్‌ కోసం బాహుబలి రచయిత

Vijayendra Prasad ready to story for Mahesh movie

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రం తర్వాత ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్‌ మరియు దిల్‌రాజులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడు. మహేష్‌బాబు 25వ చిత్రంను వచ్చే సంవత్సరం వేసవి కానుకగా విడుదల చేయబోతున్నారు. మహేష్‌ 25వ చిత్రానికి ఇంకా చాలా సమయం ఉండగానే 26వ చిత్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్‌ తన తదుపరి చిత్రంగా మహేష్‌బాబు 26వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ కథను అందిస్తున్నట్లుగా సినీవర్గాల నుండి సమాచారం అందుతుంది.

‘బాహుబలి’తో పాటు ఇంకా పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు రచయితగా వ్యవహరించిన విజయేంద్ర ప్రసాద్‌ దేశంలోనే అత్యంత ఖరీదైన రైటర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇలాంటి రచయిత వద్ద మహేష్‌బాబుకు సూట్‌ అయ్యే ఒక కథను సుకుమార్‌ గుర్తించాడు. విజయేంద్ర ప్రసాద్‌ ఒకానొక సమయంలో చెప్పిన స్టోరీ లైన్‌ సుకుమార్‌కు నచ్చడంతో అదే స్టోరీ లైన్‌ను కథగా మార్చడం జరిగింది. విజయేంద్ర ప్రసాద్‌ చాలా పవర్‌ ఫుల్‌ కథలను ఇస్తాడు. సుకుమార్‌ కథను చక్కగా చూపించడంలో సిద్ద హస్తుడు. అందుకే ఈ చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అప్పుడే చెబుతున్నారు. వచ్చే ఏడాది చివర్లో వచ్చేలా ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్‌ 25 పూర్తి కాకుండానే 26కు క్లాప్‌ పడే అవకాశం ఉంది. సుకుమార్‌, మహేష్‌బాబుల కాంబోలో గతంలో ‘నేనొక్కడినే’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అందుకే ఈ చిత్రంను కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని సుకుమార్‌ తెరకెక్కించబోతున్నాడు.