స్మృతి పెట్టిన పోస్ట్‌‌కు చాలామంది ఫిదా

స్మృతి పెట్టిన పోస్ట్‌‌కు చాలామంది ఫిదా

బుల్లితెర నటి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన స్మృతి ఇరానీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరగా ఉంటారు. ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఆమె యాక్టివ్‌గా ఉంటూ చాలా విషయాలపై చమత్కారంగా స్పందిస్తూ మంచి మెసేజ్ కూడా ఇస్తుంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ‘ఒక దెబ్బతో సెట్ అయ్యా..’ అంటూ స్మృతి ఇరానీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌‌కు చాలామంది ఫిదా అవుతున్నారు. ఆమె పెట్టిన పోస్టుతో చాలామంది కనెక్ట్ అవుతున్నారు. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

పిల్లలను క్రమశిక్షణలో పెట్టేందుకు, వారికి గౌరవ మర్యాదలు నేర్పడానికి తల్లీదండ్రులు ఏం చేస్తారో చెబుతూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు. చిన్నప్పుడు తన తల్లి ఏ సైకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లలేదని, ఒక చెంపదెబ్బతో తనను సరి చేసి ఆలోచనలను మార్చేసిందనే అర్థం వచ్చే ఓ పోస్ట్‌ను స్మృతి ఇరానీ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అంతేకాదు తన లాంటి అనుభవం ఉన్నవారు చేయి ఎత్తాలంటూ నెటిజన్లను కోరారు. ఈ పోస్టుపై చాలామంది స్పందిస్తున్నారు. తమకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్మృతి ఇరానీకి సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. పలు అంశాలపై వినూత్నంగా పోస్టులు పెట్టడంతో చాలామంది ఆమెను ఫాలో అవుతుంటారు.