షాకింగ్: సహజీవనమే 10 హత్యలకు కారణమా???

9 మరణాల వెనుకున్న మిస్టరీ

సహజంగా సీరియల్ కిల్లర్ స్టోరీలను సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే సైకోయిజంతో వచ్చిన సినిమాలు కూడా చూస్తుంటాం. ఇది అన్నింటికంటే భిన్నమైంది. కానీ.. అలాంటి టూల్ ఉన్న స్టోరీనే. నిజమైన స్టోరీ. ప్రత్యక్షంగా జరిగిన నేరం. క్రైమ్. వరంగల్ గొర్రెకుంట బాదిత కథ. ఇద్దరు మనుషుల మధ్య సహజీవన, బంధం.. ఆపై వంకర చూపు.. దాన్ని నిలదీయడంతో ఓ హత్య. ఆ హత్యను కప్పిపుచ్చుకొనేందుకు మరో ఆరు హత్యలు.. అలాగే.. సాక్ష్యం లేకుండా చేసేందుకు మరో మూడు హత్యలు. టోటల్ గా 10. ఈ హత్యలన్నీ చేసింది ఒక్కడే సంజీవ్ కుమార్ యాదవ్. ఈ క్రైమ్ స్టోరీ గొర్రెకుంటలో మొదలైంది ఇక్కడే ఒక గోదాంలో పని చేస్తోంది మక్సూద్ కుటుంబం. ఆ కుటుంబం మొత్తం సభ్యుల్లో ఆరుగురు బాలికలు.

అయితే నాలుగేళ్లుగా పరిచయం ఉన్న మరో వ్యక్తి సంజీవ్ కుమార్ యాదవ్. బెంగాల్ నుంచి వచ్చిన అతను ఒంటరివాడుగా గుడుపుతున్నాడు. దీంతో మక్సూద్ మరదలు రఫీకాకు కొంత డబ్బులు ఇచ్చి అతడు అన్నం వండించుకొని తినేవాడు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి సహజీవనం వరకు వచ్చి అలా సాగుతూ ఉంది. అప్పటికే రఫీకాకు ముగ్గురు పిల్లలు. భర్త లేడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేయసాగాడు సంజయ్.

అదేవిధంగా రఫికాతో పాటు వాళ్ల కూతురుపై సంజయ్ కన్నేశాడు. ఆమెతో చనువు పెంచుకున్నాడు. అది గమనించిన రఫికా సంజయ్ కుమార్ ను  తీవ్రస్థాయిలో హెచ్చరించింది. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. దీంతో భయపడిన సంజయ్ ఎలాగైనా రఫీకాను అడ్డుతొలగించు కోవాలని  భావించాడు. కోల్ కతా తీసుకెళ్తానని చెప్పి రైల్లో ఎక్కించాడు. రైల్లో ప్రయాణం చేసే సమయంలో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు.ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకే వెళ్లగానే రాత్రి సమయంలో చున్నీతో ఆమెను హత్య చేసి రైల్లోంచి బయటకు తోసేశాడు. ఆ తర్వాత తిరిగి వరంగల్ వచ్చాడు. మక్సూద్ కుటుంబం రఫికా గురించి అడగటం, పోలీసులకు కంప్లైంట్ చేస్తామని బెదిరించడంతో, మక్సూద్ కుటుంబాన్ని కూడా సంజయ్ కుమార్ హత్య చేశాడు.  మొత్తం 10 హత్యలు చేసినట్టుగా సంజయ్ కుమార్ ఒప్పుకున్నట్టు తాజాగా వరంగల్ సీపీ మీడియాకు వెల్లడించారు. అక్రమ సంబధం, దాని నుంచి వచ్చిన భయంతోనే ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు వివరించారు. ఒక్క హత్య నుంచి తప్పించుకోవడానికి మరిన్న హత్యలు చేశాడని..  మొత్తం 9 కాదని 10 హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో సంజయ్ ఒప్పుకున్నట్లు వరంగల్ సీపీ వివరించారు.