పాత ప్రేయసితో చాటింగ్…ఆత్మహత్యలు !

WhatsApp Chat Claims Lives of Married Man, Girlfriend in Hyderabad

అతనికి నెలన్నర క్రితమే వివాహమైంది. అయినా తన మాజీ ప్రేయసిని వదిలి ఉండలేకపోయాడు. ఆమెతో సంబంధం భార్యకు తెలిసి నిలదీసి, పంచాయతీ పెడతానని అనడంతో భయపడ్డ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు కూడా యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. రెండు ఇండ్లలో విషాదాన్ని నింపిన ఈ ఘటన హైదరాబాద్, మారేడ్ పల్లిలో చోటు చేసుకుంది. అందుతున్న సమాచారం మేరకు కే శివకుమార్ (22) అనే యువకుడికి లహరితో ఈ ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న శివకుమార్ కు వెన్నెల అనే మరో అమ్మాయితో పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉంది.

Girlfriend in Hyderabad
పెళ్లయిన తరువాత కూడా ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడు. రోజూ వాట్స్ యాప్ లో వెన్నెలతో చాటింగ్ చేస్తున్న భర్తను గమనించిన లహరి, అతన్ని నిలదీసింది. విషయం ఇంటి పెద్దలకు చెబుతానని హెచ్చరించింది. దీంతో భయపడిన శివకుమార్, శనివారం నాడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం వెన్నెలకు తెలిసింది. శివకుమార్ మరణించాడన్న మనస్తాపంతో ఆమె వెంటనే యాసిడ్ తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె ఆదివారం నాడు మరణించింది. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.