పెద్దల పంతం….మరో ప్రేమజంట ఆత్మహత్య…!

Lovers Commit Suicide

తనకు ఇష్టం లేకుండా కూతురు పెళ్లి చేసుకుందని ఆ చేసుకున్న వ్యక్తిని మారుతీరావు అనే రియల్టర్ హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తెలంగాణాలో మరో ప్రేమ కథ విషాదంతో ముగిసింది. పెద్దలు తమ పెళ్ళికి ఒప్పుకోడంలేదని తెలిసిన ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరుకు చెందిన లావణ్య, ఎల్లేష్‌లు ప్రేమలో ఉన్నారు. ఇద్దరిది ఒకే కులం వరుసకు బావా మరదళ్లు కూడా ఇంకేం పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఎలాగైనా పెద్దల్ని ఒప్పించి ఒక్కటి కావాలనుకున్నారు. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పిన ఎల్లేష్ లావణ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు ఇటు లావణ్య కుటుంబానికి కూడా విషయం తెలిసింది.

commit-suside

ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి నిరాకరించాయి. కుటుంబ సభ్యులు పెళ్లికి అడ్డు చెప్పడంతో ఎల్లేష్ బయటకు వచ్చేసాడు లావణ్యకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ఆమె కూడా తాను ప్రాణాలు తీసుకుంటానని బదులిచ్చింది. ఎల్లేష్‌ వెళ్లి ఊరిచివర చెట్టుకి ఉరి వేసుకున్నాడు, విషయం తెలుసుకున్న లావణ్య నేరుగా ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

suside-fire

ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు పరిగెత్తుకొచ్చి మంటలు ఆర్పేసే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది.. అప్పటికే ఆమె చనిపోయింది. ఒకే ఊరికి చెందిన ఇద్దరు అది కూడా బావా మరదలు వరసయ్యే వారు ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

suside