Crime :హైదరాబాద్‌ కాటేదాన్‌ లో దారుణం: మహిళ హత్యకు గురైంది..!

Atrocity in Hyderabad Catedan: A woman was killed..!
Atrocity in Hyderabad Catedan: A woman was killed..!

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని కాటేదాన్‌లో దారుణం చోటుచేసుకున్నది . గుర్తుతెలియని మహిళ హత్యకి గురయ్యింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద మహిళ తలపై దుండగులు బండరాయితో బలంగా కొట్టి హతమార్చారు. బాధితురాలిపై అత్యాచారం చేసి తర్వాత ఘాతానికి పాల్పడినట్టు తెలుస్తుంది . శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న మైలార్‌దేవ్ పల్లి పోలీసులు..మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. క్లూస్ టీం, డాగ్ స్కాట్ బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు కోసం గాలిస్తూ ఉన్నారు .

హత్యాచారాని గురైన మహిళ వివరాలని పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనా స్థలం లో లభించిన ఆధారాలను బట్టి ఆమెను సమీరాఖాన్‌గా గుర్తించారు. కాగా, ఆమె ప్రియుడే సమీరాని హత్య చేసి ఉండొచ్చని పోలీసుల ప్రాథమికంగా నిర్దారించారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడి కోసం బాగా గాలిస్తున్నారు. అలాగే, పోస్ట్‌మార్టం తర్వాతే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది తెలుస్తుందని పోలీసులు తెలియచేసారు . పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే హత్య ఎలా జరిగింది? అనేది స్పష్టత వస్తుంది.
అని చెప్పారు .