Crime: చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి

Crime: Chandrababu went to the assembly.. Vaikapa activist attacked TDP worker
Crime: Chandrababu went to the assembly.. Vaikapa activist attacked TDP worker

తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శివరామపురానికి చెందిన హరీష్కుమార్ ఈ నెల 25న కుప్పంలో జరిగిన చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నాడు.

మంగళవారం రాత్రి శివరామపురం బస్టాండులో హరీష్కుమార్పై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గణేష్ దాడికి పాల్పడ్డాడు. హరీష్కుమార్ తల్లి ప్రమీళమ్మ అడ్డుకోబోగా.. దుర్భాషలాడుతూ ఆమెపైనా దాడికి తెగబడ్డాడు. ఆమె పళ్లు దెబ్బతిన్నాయి. బాధితులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు హరీష్ కుమారే తనపై దాడి చేశాడని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.