‘హిడింబ’.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Ashwin Babu
Ashwin Babu

అశ్విన్‌ బాబు హీరో గా , నందిత శ్వేత హీరోయిన్ లు జంటగా నటించిన చిత్రం “హిడింబ” . ఈ సినిమాకి అనిల్ క‌న్నెగంటి దర్శకత్వం వహించారు . ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చి ఆహా వేదికగా ఆగస్టు 10న నుంచి ఓటీటీలోకి రానుంది

హిడింబ స్టోరీ ఏంటో తెలుసా…. : అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) పోలీస్ ట్రైనింగ్​ తీసుకుంటున్న సమయంలో లవ్​లో పడతారు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. ఆ త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు.

అయితే వీళ్లిద్ద‌రూ న‌గ‌రంలో జ‌రుగుతున్న అమ్మాయిల వరుస కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేసులో కలిసి పని చేయాల్సి వస్తుంది. . వాళ్ల చెర‌లో ఉన్న అమ్మాయిలంద‌రినీ విడిపిస్తారు. మ‌రి ఈ కేసును ఆద్య‌, అభ‌య్ ఎలా ఛేదించారు? అన్న‌ది ఆహాలో చూసి తెలుసుకోవాలి.