భార్య కామానికి… భర్తతో పాటు ప్రియుడు బలి

కర్నాటకలో ఘోరం జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ప్రియుడితో పాటు భర్త ప్రాణాలు విడిచారు. ఈ మధ్య వివాహేతర సంబంధాల కారణంగ  హత్యలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. తాజాగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటనలో ఇద్దరు బలి అయ్యారు. అందుకు కారణమైన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరు జిల్లా టి.నరసీపుర తాలూకా హొరళళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు అనే యువకుడికి ఓ మహిళతో పెళ్లయింది. కొంతకాలం వీరి కాపురం సాఫీగా సాగింది.
అయితే కొంత కాలంగా.. మహాదేవ అనే యువకుడితో ఆమె అక్రమ సంబంధం నడుపుతుంది. భర్తకు తెలియకుండా రాసలీలలు సాగిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త తీరు మార్చుకోమని హెచ్చరించాడు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తపై భార్య విపరీతంగా కక్ష పెంచుకుంది. ప్రియుడు మహాదేవతో కలిసి సిద్ధరాజును చంపేందుకు కుట్ర పన్నింది. భర్తకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి ప్రియుడితో కలిసి అతడిని కిరాతకంగా చంపేసింది. వీరికి మహదేవ స్నేహితుడు సిద్దప్ప సాయం చేశాడు. శవం కనిపించకుండా వారు ఓ చోట పూడ్చిపెట్టారు. ఆ త్వరాత ఆ అమ్మాయి అబద్దాలతో మాయ మాటలు చెప్తుంది. తన భర్త కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు.
ఆ అమ్మాయి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెపై ఆరా తీయగా.. అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రియుడితో కలిసి తానే భర్తను చంపినట్లు స్పష్టం చేసింది. పోలీసులు ఆమెతో పాటు ప్రియుడిపైనా హత్యకేసు నమోదు చేసి విచారణ జరిపారు. అది తెలుసుకున్న మహదేవ ఆందోళనకు గురై విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తీరా పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లకు విషయం తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు. వీరి మరణానికి కారణమైన ఆమెను కఠినంగా శిక్షించాలని ఇరు కుటుంబికులు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు.