అసలు నిజం ఏమిటి: భార్యాభర్తలు గొడవ… ఆత్మహత్య…

Lover Commits Suicide In Front Of Girlfriend House

తెలంగాణలో ఘోరం జరిగింది. మెదక్‌ జిల్లాలో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ఢీధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌ రెడ్డి, రుచిత తమ ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అయితే ఆ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిద్దరినీ చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమించి ఇరువురు మృతి చెందారు. కాగా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఊర్లో పూర్తి విషాదం నెలకొంది. కుటుంబంలోని బంధుమిత్రులంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.పోలీసులు చుట్టూ పరిశీలించి పూర్తి దర్యప్తును చేపడుతున్నారు. కేవలం కుటుంబ కలహాలు ఏ కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నయా అన్న కోణంలో పూర్తి దర్యాప్తును చేపడుతున్నారు.