‘భారత పార్లమెంట్​పై దాడి చేస్తా’.. ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు

Political Updates: A check on British laws..Lok Sabha approves some criminal bills
Political Updates: A check on British laws..Lok Sabha approves some criminal bills

సమయం దొరికిన ప్రతిసారి భారత్​ను అవమానించేందుకు ప్రయత్నిస్తోంది ఖలిస్థానీ గ్రూప్. ఇక ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష బెదిరింపులకు దిగింది. పార్లమెంట్​ భవనంపై దాడి చేస్తానని ఖలీస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ నేత గురుపత్వంత్​ సింగ్​ పన్నూ బెదిరించాడు. 2001లో పార్లమెంట్​పై దాడి చేసిన రోజైన డిసెంబర్​ 13న లేదా అంతకంటే ముందే మళ్లీ పార్లమెంటుపై దాడికి పాల్పడతామని ఓ వీడియోను విడుదల చేశారు. పన్నూ బెదిరింపు వీడియోతో కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

అయితే ఇటీవలే గురుపత్వంత్ సింగ్​ పన్నూను హత్య చేయడానికి కుట్రలు జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీడియో రావడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ వీడియోలో 2001 పార్లమెంట్ దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు ఫొటోతో పాటు దిల్లీ బనేగా ఖలిస్థానీ (దిల్లీని ఖలిస్థానీగా మారుస్తాం) అనే నినాదం ఉన్న పోస్టర్​ను పట్టుకుని ఉన్నాడు పన్నూ. తనను హత్య చేయడానికి భారత సంస్థలు చేసిన కుట్రలు విఫలమయ్యాయని పేర్కొంటూ.. తనపై కుట్రలకు సమాధానంగా డిసెంబర్​ 13కు ముందు పార్లమెంట్​పై దాడి చేస్తానని చెప్పాడు.