మాజీ ఎంపీ నామా నోట ఆ బూతులేంది ?

woman filed case on tdp former MP Nama Koteswara Rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టీటీడీపీ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పరువుప్రతిష్ఠలకి పెద్ద దెబ్బ తగిలింది. ఆయన ఓ మహిళని బండబూతులు తిడుతున్న ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ ఫిర్యాదు ఆధారంగానే నామా నాగేశ్వరరావు తో పాటు ఆయన సోదరుడు నామా సీతయ్య మీద హైదరాబాద్ జూబిలీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2013 నుంచి నామా తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్న ఆ మహిళ ఇతరులతో అతనికి వున్న సంబంధాల గురించి అడిగేసరికి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటూ ఎదురు దాడికి దిగారట. దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుకి వెళ్లారు. కోర్టు ఆదేశంతో నామా సోదరుల మీద తాజాగా కేసు నమోదు అయ్యింది.

నామా మీద ఫిర్యాదు చేసిన మహిళ ఓ టీవీ ఛానల్ లో ఆయన గురించి ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టింది. గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ మహిళ ప్రకాప్రతినిధి మీద కూడా నామా ఇలాగే దౌర్జన్యం చేస్తే ఆమె కేసు పెట్టిన విషయాన్ని బయటపెట్టింది. చంద్రబాబు కి ఈ విషయం మీద ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆ మహిళ ఆవేదన చెందింది. ఇక డబ్బు కోసమో ఇంకో ప్రయోజనం ఆశించో తాను ఈ విషయాలు బయట పెట్టడం లేదని ఆమె తెలిపింది. తనకు డబ్బుకి లోటు లేదని, నామా కంపెనీలన్నీ నష్టాల్లో ఉంటే ఆయన ఎక్కడ డబ్బు తెస్తారని ఆ మహిళ ఎదురు ప్రశ్నిస్తున్నారు. నామా ని స్త్రీలోలుడిగా చెబుతున్న ఆమె అతనితో పోరాడేందుకు ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధం అని చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో తనతో టీడీపీ నేత మోత్కుపల్లి కూడా మాట్లాడినట్టు ఆమె వెల్లడించారు. మొత్తానికి కష్టాల్లో టీటీడీపీకి నామా ఎపిసోడ్ ఇంకో గుదిబండ కానుంది.