World Cup 2023-Semi Final: ఫైనల్ చేరిన భారత్.. చిత్తుగా ఓడిన కివీస్..

World Cup 2023-Semi Final: India reached the final.. Kiwis lost badly..
World Cup 2023-Semi Final: India reached the final.. Kiwis lost badly..

టీమిండియా ప్రభంజనం సృష్టించింది. సెమీస్ లో న్యూజిలాండ్ పై గెలిచిన భారత్….ప్రపంచ కప్ ఫైనల్ కు చేరింది. నిన్న ముంబైలోని వాఖండే స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో భారత్ 70 పరుగులు తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టడంతో నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఆ తర్వాత న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకే భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఆల్ అవుట్ అయ్యింది. న్యూజిలాండ్ పై 2019 పరాభవానికి ఈ గెలుపుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అలాగే సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ కు చేరి టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో టీమిండియా ఉంది. ఇక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ కోల్కత్తా వేదికగా గురువారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది.