యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాలగూడకు చెందిన కాశీనాథ్ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు చెప్పగా వారి వివాహానికి అంగీకరించారు.
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని అనూష చెప్పడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. రిజిస్టర్ వివాహం చేసుకోవడానికి ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. ఆమె సెల్ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో ఈ నెల 20 వ తేదీ రాత్రి కాశీనాథ్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.