సాక్షిలో కోవర్టులెవరు జగన్..?

Sakshi Coverts For TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

సాక్షి పేపర్లో రీసెంట్ గా ఇస్తున్న వార్తల కవరేజ్ వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. సాక్షి ఎడిటోరియల్ బోర్డులో కీలక సమయంలో ఏం జరుగుతుందో తెలియక వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఓవైపు టీడీపీ అనుకూల పత్రికలో ఫుల్ పేజ్ బాబు ప్రసంగాలిస్తుంటే.. సాక్షిలో మాత్రం ఇద్దరికీ సమాన కవరేజ్ ఇవ్వడం ఎవ్వరికీ మింగుడు పడటం లేదు.

సాక్షి ఛానెల్ జగన్ ను బాగానే చూపిస్తున్నా.. పేపర్లో మాత్రం హఠాత్తుగా బ్యాలెన్స్ స్టాండ్ తీసుకోవడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ కూడా తనకు టీవీ, పేపర్ లేదని ప్రచారంలో చెప్పడం, వెంటనే బ్యాలెన్సుడు వార్తులు చూస్తుంటే.. సాక్షి పేపర్ వ్యూహంతోనే ఈ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది నిజంగా వ్యూహాత్మకమా.. లేదంటే కోవర్టులున్నారా అని పార్టీలో అనుమానం మొదలైంది.

సాక్షి పత్రికలో నిజంగా కోవర్టులుంటే జగన్ కు ముప్పు తప్పదు. ఇప్పటికే వైసీపీ సీక్రెట్లన్నీ టీడీపీకి వెళ్లిపోయుంటారని, అందుకే నంద్యాల గెలుపుపై టీడీపీ ధీమాగా ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. కానీ నిజానిజాలపై త్వరగా తేల్చాలని సాక్షి సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ ఆదేశాలు ఇచ్చారట. మరి ఆయన ఎంక్వైరీలో ఏం తేలుస్తారనేది కీలకంగా మారింది.

మరిన్ని వార్తలు:

బుద్ధి మార్చుకోని చైనా

ముందస్తు బాంబు పేల్చిన బాబు