గుండు కొట్టించుకునేదెవరు..?

tdp mla bonda uma challenged about nandyal by elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీల నేతలు.. అనూహ్యమైన సవాల్ విసురుకున్నారు. టీడీపీ గెలవకపోతే.. తాను గుండు కొట్టించుకోవడానికి రెడీ అని బోండా ఉమ ఛాలెంజ్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రగల్భాలు పలుకుతున్న రోజా వైసీపీ ఓడితే గుండు కొట్టించుకుంటారా అని సవాల్ విసిరారు. ఆయన సవాల్ కు స్పందించిన రోజా.. టీడీపీకి ముందే ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

ఓవైపు ప్రలోభాలు, మరోవైపు అభివృద్ధి పనులు.. అంది వచ్చిన ఏ అవకాశాన్ని అధికార పార్టీ వదలడం లేదు. అటు వైసీపీ కూడా ప్రలోభాల పర్వానికి తీవ్రస్థాయిలో తెరలేపింది. శిల్పా సహకరా సమితి అడగని వారికి కూడా రుణాలిస్తూ అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.

గతంలో ఎందుకు మాట్లాడలేదంటే.. ఎవరూ ఫిర్యాదు చేయలేదని టీడీపీ నేతలు తెలివిగా సమాధానం చెబుతున్నారు. టీడీపీ వైఖరి చూసి శిల్పా ఫ్యామిలీకి టెన్షన్ పట్టుకుంది. పొరపాటున ఎమ్మల్యేగా గెలిచినా.. శిల్పా సహకార సమితి కేసులో ఇరికించి అనర్హత వేటు వేయిస్తారేమోనన్న భయం వెంటాడుతోంది. కానీ బెట్టింగుల సరళి చూస్తే.. మొగ్గు వైసీపీ నుంచి టీడీపీ వైపుకు స్పష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు: