వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌ నియంత్రణ చర్యలు, వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కరోనా నియంత్రణలో భాగంగా ట్రేసింగ్‌, టెస్టింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆక్సిజన్‌ సహా అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. మాస్క్ లేకపోతే జరిమానాతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు.