చంద్రబాబు మీద వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు !

మరోసారి చంద్రబాబుని నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని వైఎస్‌ విజయమ్మ ఉద్ఘాటించారు. రానున్నది జగన్‌ రాజ్యమేనని పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు మహిళలను, రైతులను మోసం చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, నాలుగేళ్లు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రజలను మభ్య పెట్టేందుకే పసుపు కుంకుమ, అన్నదాత పేరుతో బ్యాంకుల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ మ్యానిఫెస్టోను కాపీ చేసి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌ అవినీతి పరుడంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని, ఎవరు అవినీతి పరుడో ఈ ఐదేళ్ళలో ప్రజలు గమనించారని చెప్పారు. రాజన్న బిడ్డగా నా కొడుకు జగన్‌ అధికారంలోకి వస్తాడని, రాజన్న పాలన అందిస్తాడని స్పష్టం చేశారు. మరోసారి బాబుకు ఓట్లేసి మోసపోకుండా ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్‌ రెడ్డి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కన్నా అన్ని గుణాల్లో ఉత్తముడని ఆయనకు ఈ సారి ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు. చంద్రబాబు రౌడీనా? తన కొడుకు జగన్ రౌడీనా? తమతో పెట్టుకుంటే వారి అంతు చూస్తానంటున్న చందబ్రాబు రౌడీనా? అని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ఆరోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి ముందు ‘అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తాను. ఫినిష్ చేస్తాం’ అన్నారని ఇప్పుడు కూడా జగన్ అంతు చూస్తానని అసెంబ్లీలో చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. ఈ సంఘటనలన్నీ చూస్తే ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు? అని ప్రశ్నించారు. జగన్ పై 31 కేసులున్నాయని చంద్రబాబు ప్రతి సభలో చెబుతున్నారని, తన కొడుకుపై ఆ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ తో కుమ్మక్కైన చంద్రబాబు తన కొడుకు జగన్ పై ఈ కేసులు పెట్టించారని ఆరోపించారు.