ఎన్టీఆర్ శవపూజలు చేశాడా ?

vangaveeti-narendra-sensational-comments-on-senior-ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్. ఆయన చనిపోయి ఇన్ని ఏళ్ళు గడిచినా నిత్యం ఏదో రూపంలో తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ని స్మరించుకుంటూనే వుంటారు. ఓ విధంగా చెప్పాలంటే బతికి వున్నప్పుడు ఆయనతో రాజకీయంగా విభేదించిన వాళ్ళు కూడా ఆయన బాటలో నడుస్తున్నామని చెప్పుకునేందుకు పోటీ పడ్డారు. వై .ఎస్ , జగన్ కూడా ఎన్ని సార్లు ఎన్టీఆర్ ని పొగిడి ఆయన అభిమానుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారో చూసాం. అలాంటి ఎన్టీఆర్ గురించి ఇప్పుడు ఓ స్వరం అనూహ్య ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి ఇంకెవరో కాదు స్వర్గీయ వంగవీటి రంగా సోదరుడు నారాయణ రావు కుమారుడు వంగవీటి నరేంద్ర.

వంగవీటి నరేంద్ర ఓ యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ మీద ఎవరూ ఊహించని స్థాయిలో విమర్శలు చేశారు. దానికి సంబండించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చెల్ చేస్తోంది. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎన్టీఆర్ శవపూజలు చేసాడని అప్పట్లో ఎన్ కౌంటర్ పత్రికలో వచ్చిన విషయాన్ని నరేంద్ర ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక ఆ పత్రిక నడిపిన పింగళి దశరధ రామ్ హత్య గురించి కూడా అనుమానాలు వ్యక్తం చేసాడు. ఇక రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వచ్చాకనే కుల ప్రభావం ఎక్కువ అయ్యిందని కూడా నరేంద్ర చెప్పుకొచ్చాడు.

ఇటీవల రంగా గురించి మాట్లాడి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన గౌతమ్ రెడ్డి తో నరేంద్ర మాట్లాడిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వచ్చిన పాపులారిటీ ని నిలబెట్టుకోడానికి అన్నట్టు ఎన్టీఆర్ మీద గతంలో వచ్చిన ఆరోపణల్ని మళ్లీ నరేంద్ర పైకి తీస్తున్నాడని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే రంగ గురించి పాజిటివ్ గా, ఎన్టీఆర్ గురించి నెగటివ్ గా ఈ స్థాయిలో మాట్లాడిన నరేంద్ర ఇంకో విషయంలో కూడా షాక్ ఇచ్చారు. గతంలో టీడీపీ లో చేరిన దగ్గర నుంచి బాబాయ్ భార్య రత్నకుమారితో సంబంధాలు తెంచుకున్నట్టు చెప్పుకున్నారు. మొత్తానికి వంగవీటి నరేంద్ర పెద్ద నాయకుడు ఏమీ కాకపోయినా ఆయన లేవదీస్తున్న అంశాలు, చెబుతున్న మాటలు, వచ్చిన నేపధ్యం కాస్త ఆసక్తి రేపుతున్న మాట వాస్తవం.

మరిన్ని వార్తలు:

దేవాల‌యాలు కాదు… మ‌రుగుదొడ్లు నిర్మించాలి

వినాయ‌కుడిపై ఆస్ట్రేలియా కంపెనీ అనుచిత ప్ర‌క‌ట‌న‌

బీజేపీ లోకి రెడ్డి బ్రదర్స్ ?