అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు..

అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి వణికిపోయింది. షికాగోలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. షికాగో సమీపంలోని హైలాండ్ పార్క్ లో స్వాతంత్ర దినోత్సవ పరేడ్ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. వేడుకల్లో భాగంగా పరేడ్ జరుగుతుండగా సమీపంలోని ఓ రీటెయిల్డ్ స్టోర్ పై నుంచి సాయుధుడైన ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు.

దీంతో అక్కడున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక తీవ్ర భయాందోళనతో అంతా తలోదిక్కు పారిపోయారు ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కాల్పులను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఓ దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నాటి కాల్పుల్లో పలువురు గాయపడినట్లు డెన్మార్క్ పోలీసులు తెలిపారు.