ఆసక్తి రేపుతున్న ‘కార్తికేయ 2’ ట్రైలర్‌….

‘కార్తికేయ 2 నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా జులై 22న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజా సినిమా యూనిట్ మొదటి ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.

సముద్రంలోని ద్వారకా నగరం వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ట్రైలర్‌లో కొంత క్లారిటీ ఇచ్చేసింది సినిమా యూనిట్. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు. ఇక ట్రైలర్‌లోని ప్రతి షాట్ కూడా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా కట్ చేశారు. ఇక ఇప్పుడు విడుదల చేసింది మొదటి ట్రైలర్‌ కాగా రెండో ట్రైలర్‌ త్వరలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది

కార్తికేయ 2 సినిమాలో కార్తికేయగా నిఖిల్, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతను అనే పాత్రలో ఆదిత్య మీనన్ నటిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఎ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టిజి విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానుంది..డేట్‌లు, టాలీవుడ్