ఓయ్ ముద్దపప్పు నోరు అదుపులో పెట్టుకో.. ఎంపీ భరత్ లోకేష్ కి వార్నింగ్..!

MP Bharat Lokesh
MP Bharat Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై రాజమహేంద్ర వరం ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రెండు కోట్లతో వ్యయంతో వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పాదయాత్ర అంటే ప్రజల కోసం చేసేదని, ఒళ్లు తగ్గించుకోవడానికి చేసేదానని పాదయాత్ర అంటారా అంటూ విమర్శలు గుప్పించారు.

ప్రజలు పడుకున్న తరువాత అర్థరాత్రి సమయంలో చేసే యాత్రను ఏమంటారో నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. గూగుల్ లో పప్పు అని కొడితే నారా లోకేష్ ని చూపిస్తుందని.. దొడ్డిదారిన మంత్రిగా, ఎమ్మెల్సీగా నారా లోకేష్ టీడీపీ అమలు చేయలేని పథకాలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది మహిళలుండగా . వారిలో BPL కింద 80 లక్షల సిలిండర్లు ఉచితంగా అందిస్తారా ?అని టీడీపీ స్పస్టంగా చెప్పాలన్నారు. నారా లోకేష్ కి ఇన్సూరెన్స్ పథకానికి,పెన్షన్ కి తేడా తెలియని సీఎంకి విమర్శించేంతా స్థాయి తనకి లేదని ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.