త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం …

ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి జర్మనీలో విహారయాత్రలో ఉన్న మహేష్ బాబు త్రివిక్రమ్, స్క్రిప్ట్ వర్క్‌లో చివరి మార్పులపై చర్చించినట్లు తెలుస్తోంది..ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్నసినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇందులో మరో హీరోగా ఎవరిని తీసుకోవాలి..హీరోయిన్‌గా పూజా హెగ్డే లేక ప్రియాంక అరుళ్ మోహన్‌ ను తీసుకుందామా ..ఇలాంటి పలు విషయాలను చర్చించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.చూడాలి మరి హీరోయిన్‌గా ఎవరిని మేకర్స్ ఫైనల్ చేస్తారో కాగా, మహేష్ – త్రివిక్రమ్ కాబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. గతంలో వీరిద్దరూ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే.