వెంకీ చెల్లెలు పాత్రలో పూజా హెగ్డే… స‌ల్మాన్ ఖాన్ హీరోగా ‘క‌భీ ఈద్ క‌భీ…..

భారీ ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

మ‌న టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌కు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చెల్లెలుగా క‌నిపించ‌నుందా! అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇంత‌కీ ఏ సినిమాలో అంటారా. బాలీవుడ్ మూవీలో వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా ‘క‌భీ ఈద్ క‌భీ దీపావ‌ళి’ సినిమా రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ ఆ మ‌ధ్య‌న ఓ ప్రెస్‌మీట్‌లో తెలియ‌జేశారు. అలాగే మ‌న సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న బ్యూటీ పూజా హెగ్డే ఇందులో క‌థానాయిక‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ‘క‌భీ ఈద్ క‌భీ దీపావ‌ళి’లో వెంకటేష్ చెల్లెలు పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది..

ఇటీవ‌లే ‘క‌భీ ఈద్ క‌భీ దీపావ‌ళి’ షూటింగ్ ముంబైలో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్‌లో ప్రారంభ‌మైంది. స‌ల్మాన్ ఖాన్‌, పూజా హెగ్డేల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ షూటింగ్‌లో వెంక‌టేష్ పాల్గొన‌బోతున్నారు. ఫ‌ర్హాద్ సంజీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. . బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన స‌ల్మాన్ ఖాన్ ఈ మ‌ధ్య కాలంలో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర కావాల‌ని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఆయ‌న త‌న సినిమాలో సౌత్ స్టార్స్‌ను భాగం చేశారు. వెంక‌టేష్, పూజా హెగ్డే ఈ సినిమాలో యాక్ట్ చేస్తుండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఓ ఆస‌క్తి నెల‌కొంది.