సుశాంత్ కేసు లో బయటపడ్డ సంచలన నిజాలు

సుశాంత్ కేసు లో బయటపడ్డ సంచలన నిజాలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య ఘటన ఎంతటి విషాదాన్ని నెలకొల్పిందో అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత నుంచి అసలు ఇది ఆత్మ హత్యా కాదా అనే ప్రశ్నపై ఇప్పటికీ చాలా సుస్పెన్స్ నడుస్తూనే ఉంది. ఇటీవలే సిబిఐ కు అప్పగించబడిన ఈ కేసులో ఇప్పుడు మరిన్ని ఊహించని నిజాలు వినిపిస్తున్నాయి.

అందులో భాగంగానే ప్రస్తుతం సుశాంత్ సన్నిహితుడు సిద్దార్థ్ పితానిని గత కొన్ని రోజులుగా చేస్తున్న విచారణలో భాగంగా మరిన్ని సంచలన నిజాలు బయటపడినట్టు తెలుస్తుంది. గత జూన్ నెల 8 వ తారీఖున సుశాంత్ కు మరియు అతని గర్ల్ ఫ్రెండ్ రియాకు పెద్ద గొడవ జరిగింది అని అలాగే సరిగ్గా అదే రోజున సుశాంత్ కు సంబంధించిన ఎనిమిది హార్డ్ డిస్క్ డ్రైవ్ లు ధ్వంసం చెయ్యబడ్డాయి అని తన స్నేహితుడు చెప్పారు.
.
దాంతో అసలు ఆ హార్డ్ డిస్క్ లలో వారికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉండి ఉండొచ్చు అని మరో కొత్త కోణం తలెత్తనుంది . అయితే వాటిలో ఎలాంటి సమాచారం ఉందో తనకి కూడా తెలియదని సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ తెలిపారు. ఇప్పటికే రియా చక్రవర్తి పై చాలా అనుమానాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సరికొత్త అంశం ఆమెకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందో .