10నెలల బాలికపైకి మెర్సిడెస్ బెంజ్.. చిన్నారి మృతి

న్యూఢిల్లీలోని తిలక్ నగర్ లో ఘోరం జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 10 నెలల బాలికపై దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అందుకు కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే రాధిక అనే అమ్మాయి తన ఇంటి ముందుకు పార్కింగ్ ప్రాంతంలో ఆడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలేష్ అనే కారు డ్రైవర్ ఆ చిన్నారిని గమనించకుండా కారును నపడటంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ దీపక్ పురోహిత్  ఈఘటనపై మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన రాధికను వెంటనే దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారని అక్కడ బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని అన్నారు.  కాగా ఆ చిన్నారు తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ కారు ఎలివేటర్ వ్యాపారం నడుపుతున్న జస్బీర్ సింగ్ సొంతం. కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వివరించారు. ఆ చిన్నారిని ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి చేసి ఆ చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసుల అధికారులు వివరించారు.