2021లో జూనియర్ విరాట్ …ఆనందంలో విరుష్క జంట

2021లో జూనియర్ విరాట్ ...ఆనందంలో విరుష్క జంట

బాలీవుడ్ అందాల కథానాయిక అనుష్క శర్మ- క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడే సోషల్ మీడియాలో బేబీ ప్రకటన చేశారు. మేము ఇద్దరమూ ముగ్గురు కాబోతున్నామని అంటూ వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో రాశారు. బేబీ జనవరి 2021లో వస్తాడు.. అంటూ వెళ్లడించారు. మొత్తానికి జూనియర్ విరాట్ ఆగమానికి సమయం వచ్చేసిందన్నమాట
.
దీనితో అప్పుడే సోషల్ మీడియాలో వారి అభిమానులు శుభాభివందనాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివాహం చేసుకుని మూడేళ్ళకు తొలి సంతానానికి టైమ్ వచ్చింది. అనుష్క శర్మ గర్భధారణ కు సంబంధించిన తొలి ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ జంట దుబాయ్ లోని ఐపీఎల్ నిమిత్తం వెళ్లి ఉంటున్నారు. అక్కడ నుంచే విరాట్ ఈ ఆనందకర విషయాన్ని తెలిపి ఇరువైపులా అభిమానులను సంతోషపరిచారు. ఇటీవలే అనుష్క శర్మ నిర్మించిన పలు వెబ్ సిరీస్ లు విడుదలైన సంగతి తెలిసిందే.