బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు నీటమునిగి,ఇద్దరు గల్లంతయ్యారు

బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు నీటమునిగి,ఇద్దరు గల్లంతయ్యారు

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా బీచ్‌లో మంగళవారం ముగ్గురు విద్యార్థులు నీటమునిగి, మరో ఇద్దరు గల్లంతయ్యారు.

విజయవాడకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులు స్నానం చేస్తుండగా సూర్యలంక బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

బలమైన అలలు సముద్రపు నీటిలోకి లాగడంతో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని ఈతగాళ్లు రక్షించారు.

అనంతరం సహాయక సిబ్బంది తప్పిపోయిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మృతులు విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల వయస్సు గల అభి, సిద్దు, సాయి మధుగా గుర్తించారు.