కామాంధుడి చేతిలో ఒక చిన్నారి బలి

ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లిపోతుంటే మగపైత్యం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన రాంబన్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబన్‌ జిల్లాకు చెందిన మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందుకు వచ్చింది. దాంతో పవన్‌ సింగ్‌(18) అనే ఎదురింటి అబ్బాయి.. ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి ఆ యువకుడు పరారయ్యాడు. చిన్నారి ఏడుపులు వినపడడంతో ఆమె తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా.. చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను వెంటనే అస్పత్రికి తరలించారు. కాగా చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పవన్‌ సింగ్‌ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.